Ukraine Crisis: ‘తుపాకీతో కాల్చి.. చనిపోయానని భావించి గోతిలో పాతిపెట్టారు’
రష్యా అమానుష దాడులతో ఉక్రెయిన్ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అమాయకులను చిత్రహింసలకు గురిచేస్తూ వారి ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు.......
ప్రాణాలతో బయటపడ్డ ఉక్రెయిన్ వాసి దీనగాథ
కీవ్: రష్యా అమానుష దాడులతో ఉక్రెయిన్ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అమాయకులను చిత్రహింసలకు గురిచేస్తూ వారి ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు. పుతిన్ సేనల అమానుషానికి సోదరులను కోల్పోయి, చావుబతుకుల మధ్య బయటపడిన ఓ వ్యక్తి.. తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించాడు. చిత్రహింసలకు గురిచేసి, మృతిచెందాడని భావించి తనను గోతిలో పాతిపెట్టగా.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగినట్లు వివరించాడు.
రష్యా సేనల దురాగతాలను మైకోలా కులిచెంకో (33) అనే వ్యక్తి సీఎన్ఎస్ వార్తాసంస్థతో పంచుకున్నాడు. సైనిక చర్య ప్రారంభించిన మూడున్నర వారాల తర్వాత..రష్యా సైనికులు తమపై బాంబు దాడి జరిగిందని ఆరోపిస్తూ, కులిచెంకో ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి సోదాలు చేశారు. తనతోపాటు సోదరులు యెవ్హెన్, దిమిత్రో కూడా ఆ ఇంట్లో ఉన్నట్లు కులిచెంకో తెలిపారు. తమ ముగ్గురిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి ఇంటిలో సోదాలు జరిపినట్లు పేర్కొన్నాడు. తమ తాతకు చెందిన సైనిక పతకాలతోపాటు పారాట్రూపర్గా పనిచేస్తున్న యెవ్హెన్కు సంబంధించిన ఓ బ్యాగు ఇంట్లో లభించడంతో అనుమానంతో తమను ఓ బేస్మెంట్లోపలికి తీసుకెళ్లినట్లు వివరించాడు.
నోట్లో తుపాకీ పెట్టి ఇనుప రాడ్డుతో దాడి
‘బేస్మెంట్ లోపల మమ్మల్ని మూడు రోజులపాటు చిత్రహింసలకు గరిచేస్తూ విచారించారు. మాకేమీ తెలియదని మొరపెట్టుకున్నా విడిచిపెట్టలేదు. నాలుగో రోజు అయినా వదిలేస్తారని భావించాం. కానీ అలా జరగలేదు. నోట్లో తుపాకీ పెట్టి ఓ ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేక నా ఇద్దరు సోదరులు సృహకోల్పోయారు’ అని ఆ దాడి ఘటనలను కులిచెంకో గుర్తుచేసుకుంటూ.. ఇంతటితో ఈ దురాగతం ఆగలేదని చెప్పుకొచ్చాడు. అనంతరం తమ ముగ్గురి కళ్లకు గంతలు కట్టి, ఓ సైనిక వాహనంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నాడు.
ప్రాణాలు కాపాడుకునేందుకు చనిపోయినట్లు..
ఆ నిర్మానుష్య ప్రాంతంలో గుంత తవ్వి అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. ముందుగా మా పెద్దన్నయ్యను కాల్చి చంపారు. అనంతరం నా పక్కనే ఉన్న యెవ్హెన్ను పొట్టనబెట్టుకున్నారు. ఆపై నా దవడలో ఓ రౌండ్ కాల్చారు. ఒక్కసారిగా కళ్లు బైర్లుకమ్మాయి. ప్రాణాలతో ఉన్నప్పటికీ మృతిచెందినవాడిలా కిందపడిపోయా. నేనూ చనిపోయనని భావించారు. అనంతరం మా దేహాలను ఆ గోతిలో పడేసి, పైన మట్టి కప్పి వెళ్లిపోయారు’ అని కులిచెంకో పేర్కొన్నాడు. ‘ఆ గోతి లోపల ప్రాణాలను బిగబట్టుకొని తల్లడిల్లిపోయా. శ్వాస తీసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిసేపటికి నా బలాన్నంతా కూడగట్టుకొని, నాపై పడిఉన్న పెద్దన్నయ్య శవాన్ని పక్కకు జరిపి ఎలాగోలా గోతిలోనుంచి బయటకు రాగలిగా’ అంటూ ఆ భయానక, అసహాయ ఘటనను గుర్తుచేసుకున్నాడు.
ఓ మహిళ సహాయంతో కోలుకున్నా..
అనంతరం సమీపంలోని పొలాల గుండా ఓ ఇంటికి చేరుకోగలిగానని, అక్కడే ఓ మహిళ తనకు సహాయం చేసిందని కులిచెంకో వివరించాడు. అక్కడే కొద్దిరోజులు చికిత్స తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. ‘అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగా. రష్యా దురాగతాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే నా గాథను వినిపించా’ అని అతడు పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు