Olena Zelenska: ఆయన తెర మీద హీరో.. ఆమె తెర వెనుక హీరోయిన్..!
‘నా శత్రువు మొదటి గురి నేను. ఆ తర్వాత నా కుటుంబం’ అని ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అయినా సరే.. ఆయన కుటుంబం స్వదేశంలోనే ఉండిపోయింది.
నేను నా భర్త వెంటే: జెలెన్స్కా
కీవ్: ‘నా శత్రువు మొదటి గురి నేను. ఆ తర్వాత నా కుటుంబం’ అని ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అయినా సరే.. ఆయన కుటుంబం స్వదేశంలోనే ఉండిపోయింది. మా దేశం రండి అంటూ ప్రపంచ దేశాలు ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించింది. శత్రువు పడగవిప్పి బుసకొడుతున్నా సరే.. అక్కడే ఉండేలా ఆయన్ను ప్రేరేపించింది మాత్రం వొలెనా జెలెన్స్కా. ఆమె జెలెన్స్కీ సతీమణి, ఆ దేశ ప్రధమ మహిళ. జెలెన్స్కీ దేశం విడిచిపారిపోయారంటూ గిట్టని వాళ్లు వదంతులు వ్యాప్తి చేసినా.. లేదు నా భర్త ఇక్కడే ఉన్నాడు. ఆయన వెంట నేను ఉన్నాను. ఈ ప్రజల వెంట నేనుంటాను అంటూ ధైర్యంగా చెప్తోన్న ఆమె గురించి తెలుసుకుందామా..!
తన భర్త నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారతానంటే అయిష్టం వ్యక్తం చేసిన జెలెన్స్కీ సతీమణి వొలెనా (44).. ఇప్పుడు ప్రతి అడుగులో ఆయన వెంటే నడుస్తున్నారు. శత్రువు కఠినంగా వ్యవహరిస్తున్నా.. దేశం విడిచి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. తన పిల్లలతో సహా ఇక్కడే ఉండిపోయారామె. ‘నాకు భయం లేదు. కన్నీరు రాదు. నేను ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటాను. నా పిల్లలు నా వైపు చూస్తున్నారు. నేను వారి పక్కన ఉండాలి. నా భర్త పక్కన ఉండాలి. అలాగే ఈ దేశ ప్రజల చెంత ఉండాలి’ అంటూ పెను ప్రమాదంలో దృఢ వైఖరి ప్రదర్శిస్తున్నారు. జెలెన్స్కీ నటుడిగా, దేశాధ్యక్షుడిగా ఎప్పుడూ తెరపైనే ఉన్నారు. ఆమె మాత్రం తెర వెనకే ఉండి, తన పనితాను చేసుకోవడానికి ఇష్టపడేవారు. అయితే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో మాత్రం తన మాటలతో ప్రపంచం దృష్టిలో పడ్డారు.
ఆర్కిటెక్చర్ చదివిన జెలెన్స్కా.. తదనంతర కాలంలో రచయితగా తన అభిరుచిని కొనసాగించారు. ఆమె, జెలెన్స్కీ చిన్నప్పటి నుంచే కలిసి చదువుకున్నప్పటికీ.. కళాశాల స్థాయిలోనే వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం.. 2003లో వివాహానికి దారితీసింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. నటుడిగా కెరీర్ను వదిలి, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం మొదలు పెడతానని జెలెన్స్కీ అనగానే వొలెనా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సరే, రాజకీయ నేత నుంచి అధ్యక్షుడిగా ఎదిగే క్రమంలో ఆయన వెంటే ఉండి నడిపించారు.
2019లో భర్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాకా.. ఆమె కూడా ప్రధమ మహిళ స్థానంలో ఇమిడిపోయారు. తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై లింగ వివక్షకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు, వినిపిస్తున్నారు. దేశ భవిష్యత్తు అయిన చిన్నారులకు పోషకాహారం అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. అధ్యక్షుడితో కలిసి చేస్తోన్న పర్యటనల్లో భాగంగా ఈ విషయాన్ని జపాన్ నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు. అందుకే విదేశీ పర్యటనలు కొత్త విషయాలు తెలుసుకునే సందర్భాలంటారామె. ఉక్రెయిన్ ప్రజలందరికీ సమాన అవకాశాలు, కల్చరల్ డిప్లమసీ ఆమె ప్రాధాన్యాంశాలు. ఫ్యాషన్ మీద ఆమెకు మక్కువ ఎక్కువే. విదేశీ పర్యటనల్లో భాగంగా ఆమె ధరించిన దుస్తులకు ప్రశంసలు దక్కుతాయి. అయితే ఆమె ఉక్రెయిన్లో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇదంతా ఒకెత్తు కాగా.. ప్రస్తుతం ఆమె తన దేశం కోసం నిలబడిన తీరు అభినందనీయం.
ప్రస్తుతం రష్యా దాడితో ఎంతోమంది ఉక్రెయిన్ పౌరులు.. పరాయి దేశాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎన్నో మరణాలు నమోదవుతున్నాయి. కానీ ఆమె ఈ సమయంలో ఆ దేశంలోనే ఉంటూ.. తన దేశం కోలుకునే దిశగానే దృష్టి సారిస్తున్నారు. ‘ఈ శిశువు కీవ్ బాంబ్ షెల్టర్లో జన్మించాడు. ఈ జననం ప్రశాంత వాతావరణంలో జరగాల్సింది. యుద్ధం జరుగుతున్నా వైద్యులు, సిబ్బంది ఆ తల్లిని జాగ్రత్తగా చూసుకున్నారు’ అంటూ ఆమె ఇన్స్టాలో పెట్టిన పోస్టు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ప్రశంసించారు. ప్రజలు నిస్సహాయ స్థితిలోకి జారకుండా మాటలతో ధైర్యం చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె ఉక్రెయిన్లోని ఉన్నప్పటికీ.. కచ్చితంగా ఎక్కడున్నారో తెలియడం లేదు. ఇక ఉక్రెయిన్, రష్యా పోరు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఆ ఉద్రిక్త పరిస్థితులు ఇరు దేశాలకు, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు మిగులుస్తాయోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు