Ukraine Crisis: ఉక్రెయిన్-రష్యా యుద్ధం పదేళ్లు కొనసాగొచ్చు..!
రెండు నెలలుగా ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం 10 సంవత్సరాల పాటు కొనసాగొచ్చంటూ యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ వ్యాఖ్యానించారు.
లండన్: రెండు నెలలుగా ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం 10 సంవత్సరాల పాటు కొనసాగొచ్చంటూ యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ దాడిలో పుతిన్ విజయం సాధిస్తే.. ఐరోపాలో భయంకరమైన దుస్థితి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగొచ్చని, అందుకు ఐరోపా సిద్ధంగా ఉండాలని లిజ్ ట్రస్ హెచ్చరించారు. బ్రిటన్, దాని మిత్ర దేశాలు రష్యాను ఉక్రెయిన్ నుంచి వెళ్లగొట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ సంక్షోభం వేళ.. అంతర్జాతీయ భద్రత విషయంలో మార్పులు తెచ్చేలా ముందుకు కదలాలన్నారు. ప్రపంచ నికర సంపదలో 50 శాతానికి పైగా వాటా ఉన్న జీ7 దేశాలు దురాక్రమణ దారుల్ని అడ్డుకొనే అంశంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా పుతిన్ను ఉద్దేశించి, ఆమె కఠిన పదజాలం వాడారు. ఇక, రష్యా సేనలు ఉక్రెయిన్లోనే కొనసాగితే.. జార్జియా, మాల్దొవా దేశాలపై కూడా అవి దాడులు చేసే అవకాశం ఉందని యూకే ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా తన సైనిక చర్యను ప్రారంభించింది. అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాను ఆంక్షల చట్రంలో బంధించాయి. అయినా మాస్కో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఊహించని రీతిలో ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో.. పుతిన్ సేనలు రెచ్చిపోయి, విధ్వంసానికి పాల్పడుతున్నాయి. దాంతో ఇరువైపు ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. అమాయకుల్ని హతమార్చడం, లైంగిక దాడులకు పాల్పడటం వంటివి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం