Imran Khan: మళ్లీ పాక్ సైన్యాన్ని టార్గెట్ చేసిన ఇమ్రాన్.. అమెరికాపై యూటర్న్!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan) ఆ దేశ సైన్యాన్ని మరోసారి టార్గెట్ చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan) ఆ దేశ సైన్యాన్ని మరోసారి టార్గెట్ చేశారు. స్వతంత్ర సంస్థలను గతంలో నిర్వీర్యం చేయడంతో పాటు రాజకీయ కుటుంబాలతో చేతులు కలిపి చట్టానికి తామే అతీతులన్నట్టుగా సైన్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్లో ముందస్తు ఎన్నికలు ప్రకటించాలన్న డిమాండ్తో లాంగ్ మార్చ్ చేపట్టిన ఇమ్రాన్ ఖాన్.. ఇటీవల పంజాబ్ ప్రావిన్స్లో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బ్రిటిష్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ సైన్యంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
2011లో పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తసీర్ను ఓ మత తీవ్రవాది చంపిన విధంగానే తననూ హత్య చేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ నసీర్లు కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. గతంలో స్వతంత్ర సంస్థల్ని మిలటరీ నిర్వీర్యం చేసిందన్న ఇమ్రాన్.. షరీఫ్ కుటుంబంలాంటి రాజకీయ వారసత్వాలతో కలిసి చట్టానికి తామే అతీతులు అన్నట్టుగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న సమయంలో తమను బలిపశువులుగా మార్చేందుకు సహకరించే వ్యక్తిని ఆర్మీ చీఫ్గా నియమించేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఏప్రిల్లో ఇమ్రాన్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పరిస్థితి తారుమారైంది. దోచుకున్న సంపదను కాపాడుకొనేందుకు, సార్వత్రిక ఎన్నికల్లో మోసాలకు పాల్పడేందుకు షెహబాజ్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం తమకు నచ్చిన వ్యక్తిని ఆర్మీ చీఫ్ని నియమించాలని చూస్తోందంటూ ఇప్పుడు ఇమ్రాన్ ఖానే ఆరోపణలు చేయడం గమనార్హం.
ఇకపై అమెరికాను నిందించను..
తన ప్రభుత్వం కూలిపోవడంలో అమెరికా(America) పాత్ర ఉందని ఆరోపణలు చేస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan).. తాజాగా అగ్రరాజ్యం విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఇకపై ఈ విషయంలో అమెరికాను నిందించబోనని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను మళ్లీ పాక్ ప్రధానిగా ఎన్నికైతే ఆ దేశంతో సంబంధాలను(Pak- US Relations) సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. తాను ప్రధాని పీఠం నుంచి దిగిపోయేలా పాక్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అమెరికాలు కుట్ర పన్నాయని ఇమ్రాన్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘నాకు సంబంధించినంతవరకు ఈ అధ్యాయం ముగిసిపోయింది. నేను దాన్ని మర్చిపోయా. ఈ విషయంలో ఇకపై అమెరికాను నిందించను. తిరిగి ఎన్నికైతే ఆ దేశంతో గౌరవప్రద సంబంధాలు కోరుకుంటున్నా. నేను నాయకత్వం వహించాలనుకుంటున్న పాకిస్థాన్.. ప్రతి దేశంతో, ముఖ్యంగా అమెరికాతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అగ్రరాజ్యంతో మా సంబంధం.. యజమాని- సేవకుడు/బానిస సంబంధం వంటిది. ఆ దేశం.. మమ్మల్ని ఒక కిరాయి తుపాకీలా ఉపయోగించుకుంది. అయితే, ఈ విషయంలో అమెరికా కంటే సొంత ప్రభుత్వాలనే ఎక్కువగా విమర్శించా’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.
పాకిస్థాన్లో రాజకీయ సుస్థిరతను నెలకొల్పేందుకు.. ముందస్తు ఎన్నికలే ఏకైక మార్గమని ఇమ్రాన్ అన్నారు. త్వరలో ఎన్నికలు నిర్వహించకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని హెచ్చరించారు. పాక్ సైన్యం గతంలో దేశంలోని స్వతంత్ర వ్యవస్థలను బలహీనపర్చిందని ఆరోపించిన ఇమ్రాన్.. తాజాగా దేశాభివృద్ధి విషయంలో తన భవిష్యత్తు ప్రణాళికల్లో సైన్యం నిర్మాణాత్మక పాత్ర పోషించగలదన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు ఒక రోజు ముందు మాస్కోను సందర్శించడం.. ఇబ్బందికర సందర్భంగా ఖాన్ అంగీకరించారు. అయితే, తన పర్యటన నెలల ముందే నిర్ణయమైనట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM