Imran khan: నన్ను చంపేందుకు ముగ్గురు షూటర్లు ప్రయత్నించారు: ఇమ్రాన్
పంజాబ్ ప్రావిన్స్లోని వజీరాబాద్లో నవంబర్ తొలి వారంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్టు పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అన్నారు.
ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్స్లోని వజీరాబాద్లో నవంబర్ తొలి వారంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నంలో ముగ్గురు షూటర్లు పాల్గొన్నట్టు పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అన్నారు. దేశంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్తో ఆయన చేపట్టిన లాంగ్ మార్చ్లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా దుండగుల కాల్పుల్లో ఆయన కుడికాలికి గాయాలైన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించిన ర్యాలీలో ఆయన తొలిసారి ప్రసంగించారు. పాక్లో అత్యంత శక్తిమంతమైన సైన్యం ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలో శనివారం రాత్రి నిర్వహించిన భారీ ర్యాలీలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. తనను హత్య చేసేందుకు ముగ్గురు షూటర్లు ప్రయత్నించారన్నారు.
లాంగ్మార్చ్లో ఒకడు తన పైన, పీటీఐ నేతలపై కాల్పులు జరపగా.. మరోవ్యక్తి కంటెయినర్ ముందు భాగంలో కాల్పులు జరిపాడన్నారు. అలాగే, మూడో షూటర్ మొదటి సాయుధుడిని చంపేందుకు వచ్చాడని.. ఆ క్రమంలో జరిపిన కాల్పుల సమయంలోనే తూటా తగిలి ఒకరు బలైపోయారన్నారు. వజీరాబాద్లో తన హత్యకు ప్రయత్నాలు విఫలం కావడంతో మళ్లీ తనను టార్గెట్ చేసుకొనేందుకు ఎదురుచూస్తున్నారంటూ ఆరోపించారు. తనపై దాడి వెనుక ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ ఉన్నారంటూ పదే పదే ఆరోపిస్తోన్న ఇమ్రాన్ ఖాన్.. కొత్త ఎన్నికల తేదీలను ప్రకటించే వరకు తన నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మరోవైపు, తనపై కాల్పుల ఘటన మరుసటి రోజు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తన కుడికాలికి నాలుగు బుల్లెట్లు తగిలాయని.. ఇద్దరు షూటర్లు కాల్పులు జరిపినట్టు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.