Imran Khan: ఆరు రోజుల్లో ప్రకటన చేయలేదో.. దేశం మొత్తం రాజధానిలో ఉంటుంది..!
‘ఆరు రోజుల్లో ఎన్నికలపై ప్రకటన చేయండి లేదంటే మొత్తం దేశంతో కలిసి ఇస్లామాబాద్కు తిరిగివస్తాను’ అని హెచ్చరించారు పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్. దేశ రాజధానిలో నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రభుత్వానికి ఈ డిమాండ్లు వినిపించారు.
ఇస్లామాబాద్: ‘ఆరు రోజుల్లో ఎన్నికలపై ప్రకటన చేయండి లేదంటే మొత్తం దేశంతో కలిసి ఇస్లామాబాద్కు తిరిగివస్తా’ అని హెచ్చరించారు పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్. దేశ రాజధానిలో నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రభుత్వానికి ఈ డిమాండ్లు వినిపించారు. ‘పీటీఐ కార్యకర్తలు మార్చ్ను ఆపేందుకు దిగుమతి చేసుకున్న ప్రభుత్వం చేపడుతోన్న అరెస్టులు, సోదాలను ఇమ్రాన్ ఖండించారు. ఆ ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యూహాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవడంపై ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు’ అంటూ అక్కడి వార్తా సంస్థ డాన్ పేర్కొంది.
కొద్ది వారాల క్రితం మెజార్టీ కోల్పోవడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయారు. ఆయన స్థానంలో పీఎంఎల్(ఎన్) పార్టీకి చెందిన షహబాజ్ షరీఫ్ ఆ పదవిని చేపట్టారు. ఇది దిగుమతి చేసుకున్న ప్రభుత్వమంటూ మొదట్నుంచి కొత్త ప్రభుత్వంపై ఇమ్రాన్ విమర్శలు చేస్తున్నారు. అలాగే కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇస్లామాబాద్లోని డీ చౌక్ వద్ద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనికి సుప్రీం కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. అయితే వేల సంఖ్యలో వచ్చిన నిరసనకారులు బారికేడ్లను తొలగించడంతో వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. పీటీఐ కార్యకర్తలపై లాఠీ ఛార్జి జరిగినట్లుగా అక్కడి మీడియాలో ప్రసారం అయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అలాగే పలువురు మహిళలు, చిన్నారులు గాయపడినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఈ ఘర్షణల కారణంగా ప్రస్తుతానికి ఇమ్రాన్ ఆ నిరసన ర్యాలీని నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీకు ఆరు రోజుల సమయం ఇస్తున్నాను. ఆరురోజుల్లో ఎన్నికలపై ప్రకటన చేయండి. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు జూన్లో పార్లమెంట్ను రద్దు చేయండి. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే మళ్లీ రాజధానిలో నిరసనలు చేపడతాం’ అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM