Imran Khan: ఏడు స్థానాల్లో పోటీ చేసి.. ఆరుచోట్ల గెలిచాడు
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే ఏడు స్థానాల నుంచి పోటీ చేయగా.. అందులో ఆరు స్థానాల్లో విజయం సాధించారు.
ఇస్లామాబాద్: అవిశ్వాస తీర్మానంతో ఓటమిచెంది పదవి కోల్పోయిన పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో పీటీఐ పార్టీ భారీ విజయం సాధించింది. జాతీయ అసెంబ్లీతోపాటు స్థానిక ప్రావిన్సులకు సంబంధించి మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరగగా.. ఎనిమిదింటిని పీటీఐ కైవసం చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఒక్కరే ఏడు స్థానాల నుంచి పోటీ చేయగా.. అందులో ఆరు స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటుకున్నారు. తాజా ఉప ఎన్నికలను రిఫరెండంగా పేర్కొన్న ఇమ్రాన్.. అధికారపక్షంపై ఈస్థాయిలో విజయం సాధించడం మామూలు విషయం కాదని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అవిశ్వాస తీర్మానంతో ఓటమి తర్వాత.. నేషనల్ అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేయాలని పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీకి చెందిన సభ్యులకు సూచించారు. అందుకు అనుగుణంగా పీటీఐ నేతలు రాజీనామా చేశారు. అందులో ఎనిమిది స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ఇటీవల నిర్వహించింది. వీటితో పాటు పంజాబ్ ప్రావిన్సులోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిపింది.
ఇందులో భాగంగా నేషనల్ అసెంబ్లీలో (పార్లమెంట్ దిగువసభ) ఎనిమిది స్థానాలకు గాను.. ఏడు చోట్ల నుంచి పీటీఐ తరఫున ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే పోటీకి దిగారు. తాజా ఫలితాల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించగా ఒక్క కరాచీ స్థానంలో మాత్రమే ఓడిపోయారు. మరో నియోజకవర్గం ముల్తాన్ నుంచి పోటీ చేసిన పీటీఐ అభ్యర్థి ఓటమి చెందారు. ఇలా ఆరు నేషనల్ అసెంబ్లీ స్థానాలతో పాటు మరో రెండు అసెంబ్లీ ప్రావిన్సుల్లోనూ పీటీఐ విజయం సాధించింది. అధికార కూటమి మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. అంతకుముందు (ఈ ఏడాది జులైలో) పంజాబ్ అసెంబ్లీకి 20స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పీటీఐ పార్టీ 15 స్థానాలను కైవసం చేసుకుంది. చట్టసభ సభ్యులు తీసుకున్న నిర్ణయం తప్పని.. వారి తప్పిదాన్ని గుర్తించేందుకు తాజా ఫలితాలు మరో అవకాశాన్ని కల్పిస్తున్నాయని పీటీఐ సెక్రటరీ జనరల్ అసద్ ఉమర్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికలు జరగాలని ప్రజలు నిర్ణయించినట్లు ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందని మాజీ మంత్రి ఫవాద్ చౌద్రీ అన్నారు.
ఇదిలాఉంటే, పాకిస్థాన్ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే మాత్రం ఏ స్థానాలను వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఇలా ఇమ్రాన్ ఖాన్ మాదిరిగా ఒకేసారి అనేక స్థానాల్లో పోటీ చేయడం మాత్రం అరుదని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆరు చోట్ల గెలిచినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఎక్కడా ప్రాతినిధ్యం వహించరని పీటీఐ పార్టీ పేర్కొంది. అయితే, షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్లో పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, అంతకుముందే ఎన్నికలను నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ (పీటీఐ) పట్టుబడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.