Imran Khan: ఆర్మీ చీఫ్ను ఇమ్రాన్ క్లీన్ బౌల్డ్ చేద్దామంటే.. ప్చ్! అది నో బాల్!!
విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చివరి బంతి వరకు పోరాడతానంటూ వ్యాఖ్యానించిన ఇమ్రాన్.. అన్నట్లుగానే తన పదవి నిలబెట్టుకోవడానికి నానా ప్రయత్నాలూ చేశారు. అంతేకాదు తన వ్యతిరేకి అయిన ఆర్మీ చీఫ్ను క్లీన్ బౌల్డ్ చేద్దామనుకున్నప్పటికీ.. అది అనూహ్యంగా నో బాల్ అయ్యిందని తెలుస్తోంది.
ఇస్లామాబాద్: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చివరి బంతి వరకు పోరాడతానంటూ వ్యాఖ్యానించిన ఇమ్రాన్.. అన్నట్లుగానే తన పదవి నిలబెట్టుకోవడానికి నానా ప్రయత్నాలూ చేశారు. అంతేకాదు తన వ్యతిరేకి అయిన ఆర్మీ చీఫ్ను క్లీన్ బౌల్డ్ చేద్దామనుకున్నప్పటికీ.. అది అనూహ్యంగా నో బాల్ అయ్యిందని తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ జనరల్ అయిన జావేద్ బజ్వాను తొలగించి.. తనకు అనుకూలమైన వ్యక్తిని ఆర్మీ చీఫ్గా నియమించాలని చివరి నిమిషయంలో ఇమ్రాన్ ప్రయత్నించారని, అయితే, రక్షణ మంత్రిత్వ శాఖ అందుకు తగిన నోటిఫికేషన్ జారీ చేయడంలో విఫలమైందంటూ బీబీసీ ఉర్దూ ఓ కథనంలో పేర్కొంది.
పదవీచ్యుతుడు కావడానికి కొన్ని గంటల ముందు ఇమ్రాన్ నివాసానికి ఓ హెలికాప్టర్ వచ్చిందని, అందులో కీలకమైన ఇద్దరు వ్యక్తులు ఇమ్రాన్తో భేటీ అయ్యారని బీబీసీ ఉర్దూ ఓ కథనంలో పేర్కొంది. సుమారు 45 నిమిషాల పాటు వీరి మధ్య సమావేశం జరిగిందని, సుహృద్భావ వాతావరణంలో అయితే ఈ భేటీ జరగలేదని తెలిపింది. ‘‘తనతో భేటీ కావడానికి గంట ముందు ప్రధాని ఇమ్రాన్ ఆర్మీ చీఫ్ను తొలగించేందుకు ఉత్తర్వులు వెలువరించారు. అయితే, హెలికాప్టర్లో వచ్చిన వ్యక్తులు తాను ఊహించినట్టు కాకుండా వేరే వారు వచ్చారు. వాస్తవానికి కొత్తగా నియమించాలనకున్న వ్యక్తి వస్తారని ఇమ్రాన్ తొలుత భావించారు’’ అని బీబీసీ రాసుకొచ్చింది. అయితే, కొత్త నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువరించడంలో ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ విఫలమైందని పేర్కొంది. అయితే, వచ్చిన ఆ ఇద్దరూ ఎవరు అనేది బీబీసీ ధ్రువీకరించలేదు. అయితే, వారు ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ అయ్యుంటారని తెలుస్తోంది.
అయితే, బీబీసీలో వచ్చిన ఈ కథనాన్ని ఆర్మీ వర్గాలు ఖండిచాయి. పూర్తిగా అవాస్తవాలతో వండివార్చిన కథనమని పేర్కొన్నాయి. ఆ కథనానికి విశ్వసనీయత లేదని డాన్ పత్రిక పేర్కొంది. ఆర్మీ చీఫ్ను మార్చాలని ప్రయత్నించినట్లు వచ్చిన వార్తలను ఇమ్రాన్ సైతం కొట్టిపారేశారు. అందులో ఎలాంటి నిజం తెలిపారు. మరోవైపు ఆర్మీ చీఫ్ను మార్చేందుకు ఇమ్రాన్ చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అదాన్ ఇక్బాల్ అనే న్యాయవాది పిటిషన్ కూడా సిద్ధం చేశారని, ఒకవేళ రక్షణ శాఖ నోటిఫికేషన్ వెలువరిస్తే ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయంచినట్లు బీబీసీ పేర్కొంది. సాంకేతిక కారణాలతో నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో పిటిషన్ వేయలేదని తెలిపింది. అయితే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బజ్వాను తొలగించకుండా ప్రధాని ఇమ్రాన్ను నిలువరించాలని కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైందని ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. ఏదైతేనేం.. పాకిస్థాన్లో శనివారం అర్ధరాత్రి దాటేవరకూ కొనసాగిన ‘రాజకీయ క్రీడ’లో ప్రధాని పదవిని కోల్పోయారు. క్రికెట్లో ఎంతోమందిని బౌల్డ్ చేసిన ఫాస్ట్ బౌలర్.. ప్రతిపక్షాలు సంధించిన అవిశ్వాస తీర్మానం అనే బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM