Pakistan: ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లేనా..?
ఇమ్రాన్ ప్రభుత్వంలో కీలక భాగస్వామ పక్షాలుగా ఉన్న మూడు పార్టీలు మంత్రివర్గం నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతునట్లు సమాచారం.
మద్దతు ఉపసంహరించుకునే యోచనలో భాగస్వామ్యపక్షాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు పదవీగండం తప్పేటట్లు కనిపించడం లేదు. తన ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగులనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇమ్రాన్ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న మూడు పార్టీలు మంత్రివర్గం నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతునట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇమ్రాన్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పాకిస్థాన్ ప్రతిపక్ష పార్టీలు.. ఆయనపై ఇటీవలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇదే సమయంలో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వంలోని మూడు భాగస్వామ్యపక్షాలు కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్లమెంట్ దిగువసభలో (ఐదుగురు సభ్యులతో) కీలక భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఖయీద్ నేత ఛౌద్రీ పర్వేజ్ ఎలాహీ ఈ విషయాన్ని వెల్లడించారు. తమతోపాటు ఐదు సీట్లున్న బలోచిస్థాన్ ఆవామీ పార్టీ, ఏడు సీట్లున్న ముత్తహిదా ఖామీ మూవ్మెంట్-పాకిస్థాన్ పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉండాలా..? లేదా? అనే విషయంపై సంయుక్త నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఒకవేళ వైదొలగాలని నిర్ణయిస్తే మాత్రం ప్రతిపక్షాలకు మరింత మద్దతు పెరిగినట్లు అవుతుందన్నారు. ఇటువంటి సందర్భంలో ‘భాగస్వామ్యపక్షాలను ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగతంగా కలిసి ఏమేరకు బుజ్జగిస్తారనేది కీలకం. లేదంటే ఇమ్రాన్ఖాన్ వందశాతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లే’ అని ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్వేజ్ ఎలాహీ స్పష్టం చేశారు.
అవిశ్వాసం ఎందుకంటే..
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభాలకు ఇమ్రాన్ ప్రభుత్వ విధానాలే కారణమంటూ మండిపడుతున్నాయి. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విపరీతంగా పెరిగిన రుణాలు వంటి సంక్షోభాలపై ఇమ్రాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటికి బాధ్యత వహిస్తూ ఇమ్రాన్ ఖాన్ను పదవినుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అక్కడి నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటు)లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కావాల్సిన 172 మందికిపైగా సభ్యుల మద్దతు తమకు ఉందని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తదితర పార్టీలు ప్రకటించాయి. మార్చి 28-30 తేదీల్లో ఈ తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.
ఇమ్రాన్కు గడ్డుకాలమే..
ఇలా ప్రభుత్వంపై విపక్షాలు తీర్మానాన్ని ప్రవేశపెడుతామని చెబుతుండడంపై ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇప్పటివరకు బెదిరింపు ధోరణిలోనే స్పందిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతే, పర్యవసానాలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా..? అంటూ పలుసార్లు హెచ్చరించారు. తాజాగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి రెడీ కావడంతో దాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామంటూ ఇమ్రాన్ ఖాన్ సలహాదారులు పేర్కొంటున్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలు మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధం కావడం.. నామమాత్రపు మెజారిటీతో నెట్టుకొస్తున్న ఖాన్ పార్టీకి (పీటీఐ)కి ఇబ్బంది కలిగించే విషయంగా కనిపిస్తోంది. 342 మంది సభ్యులున్న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటు)లో 172 మంది ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవి ఊడిపోయినట్లేనని భాగస్వామ్య పక్షాలే చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు