Imran Khan: నన్ను అపహరించి, హత్య చేయడమే వారి లక్ష్యం..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను అరెస్టు చేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. దీనిపై ఇమ్రాన్ ట్విటర్ వేదికగా పలు పోస్టులు పెట్టారు.
ఇస్లామాబాద్: ఆర్థిక ఇక్కట్లు అనుభవిస్తోన్న పాకిస్థాన్లో రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొంది. విదేశీ కానుకల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్(Imran Khan)పై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. పోలీసులు ఆయన అరెస్టుకు యత్నించడంతో లాహోర్లో తీవ్ర ఘర్షణ తలెత్తింది. పోలీసులు, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు.
‘నన్ను అపహరించి, హత్య చేయడమే వారి అసలు ఉద్దేశం. అరెస్టు ప్లాన్ అనేది ఒక డ్రామా మాత్రమే. వారు బాష్పవాయువు, జలఫిరంగులు వాడారు. చివరకు లైవ్ ఫైరింగ్కు పాల్పడ్డారు. నేను నిన్న సాయంత్రం ష్యూరిటీ బాండ్పై సంతకం చేసినా.. డీఐజీ దానిని అంగీకరించలేదు. వారి అరెస్టు ప్లాన్లో నిస్సందేహంగా ఏదో దురుద్దేశం ఉంది’ అని బుల్లెట్ల షెల్స్తో ఉన్న వీడియోను ఇమ్రాన్(Imran Khan) పోస్టు చేశారు.
ఇదంతా లండన్ ప్లాన్లో భాగమే..!
తన అరెస్టు కుట్ర అంతా లండన్ ప్లాన్లో భాగమని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ‘ఇదంతా లండన్ ప్రణాళికలో భాగం. ఇమ్రాన్ను జైల్లో పెట్టడానికి, పీటీఐని లేకుండా చేయడానికి, నవాజ్ షరీఫ్ మీద కేసులన్నీ కొట్టివేయించడానికి అక్కడ ఒక ఒప్పందం మీద సంతకాలు జరిగాయి’ అని వ్యాఖ్యలు చేశారు. తాను మార్చి 18న కోర్టుకు వస్తానని హమీ ఇచ్చినప్పటికీ.. తన ప్రజలపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. మంగళవారం ఇమ్రాన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు భారీ సంఖ్యలో లాహోర్లోని జమన్ పార్కు నివాసానికి చేరుకున్నారు.
ఆ ప్రాంతంలోని దారులన్నీ కంటైనర్లు అడ్డుపెట్టి మూసివేసి, ఇమ్రాన్(Imran Khan) ఇంటిని ముట్టడించారు. పోలీసుల చర్యలను ప్రతిఘటించడానికి ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కార్యకర్తలు సైతం పెద్దసంఖ్యలో అక్కడికి చొచ్చుకొని వచ్చారు. పీటీఐ కార్యకర్తలను చెదరగొట్టేందుకు బాష్పవాయువు, జల ఫిరంగులను పోలీసులు ప్రయోగించారు. ప్రతిగా కార్యకర్తలు పోలీసుల పైకి రాళ్లు, ఇటుకలు విసిరారు. కర్రలతోనూ దాడికి దిగారు. ఈ పరస్పర దాడుల్లో కొంతమంది పోలీసు అధికారులు, పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం