Ukraine Crisis: 10 చిత్రాల్లో.. ఉక్రెయిన్ పరిస్థితులు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సైనిక చర్యతో ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. రాత్రికి రాత్రే ఉక్రెయిన్పై క్షిపణులు, బాంబులతో రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపించింది
ఇంటర్నెట్డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యతో ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. రాత్రికి రాత్రే ఉక్రెయిన్పై క్షిపణులు, బాంబులతో రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా కీలక నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. తొలుత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు ప్రకటించిన రష్యా.. ఆ తర్వాత నివాస సముదాయాలపైనా దాడులకు దిగింది. రష్యా దాడుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఉక్రెయిన్ పౌరులు బెంబేలెత్తిపోతున్నారు. భీకర శబ్దాల నడుమ ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. కొందరు నగరాలను వీడి ఇతర దేశాల సరిహద్దులకు వెళ్తోంటే.. మరికొందరు అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కీవ్ వీధుల్లో భారీ ట్రాఫిక్ జామ్లు.. క్షిపణుల దాడిలో ధ్వంసమైన భవనాలు.. ఉక్రెయిన్లో భయానక పరిస్థితులను అద్దం పడుతున్నాయి.
ఉక్రెయిన్ - క్రిమియా సరిహద్దు దాటి ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా బలగాలు ప్రవేశిస్తున్న దృశ్యం.
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఓ సైనిక భవనంపై రష్యా జరిపిన వైమానిక దాడి అనంతర దృశ్యం.
రష్యా దాడిలో మరియుపోల్లోని సైనిక స్థావరం వద్ద ధ్వంసమైన రాడార్ అరేస్, ఇతర సైనిక పరికరాలు, వాహనాలు.
ఉద్రిక్తతల నేపథ్యంలో డబ్బుల కోసం ఏటీఎం వద్ద ప్రజలు బారులు తీరారు.
రష్యా దాడులతో ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ ప్రకటించడంతో వాహనాల్లో ఇంధనం నింపేందుకు పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు.
వైమానిక దాడులతో భయాందోళనకు గురైన రాజధాని కీవ్ నగర వాసులు ఇతర ప్రాంతాలకు బయల్దేరారు. దీంతో కీవ్ వీధుల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయిన దృశ్యం.
ఖార్కివ్లోని చుహివ్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్పై రష్యా వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో గాయపడిన మహిళ.
కీవ్ నగరాన్ని వీడి వెళ్లేందుకు ఓ మహిళ తన కుమార్తెతో కలిసి రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తోన్న దృశ్యం.
ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం స్థానికులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు.
కీవ్పై ప్రయోగించిన రష్యా షెల్లింగ్ ఒకటి ఇలా భవనాల పక్కన పడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే