China: అక్కడ కొవిడ్ సోకితే.. తల్లి అక్కడ.. బిడ్డ ఇంకో దగ్గర..!
కరోనా వైరస్ను కట్టడిచేసే విషయం చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి తప్ప ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా నిర్బంధిస్తోంది
షాంఘై: కరోనా వైరస్ను కట్టడిచేసే విషయం చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి తప్ప ప్రజలు బయటకు రావడానికి వీలు లేకుండా నిర్బంధిస్తోంది. చివరకు కొవిడ్ సోకిన పసికందుల్ని తల్లిదండ్రుల నుంచి వేరుచేస్తోంది..!
చైనాలో అత్యధిక జనాబా కలిగిన నగరం, ఫైనాన్షియల్ హబ్ అయిన షాంఘై ఇప్పుడు కొవిడ్ కోరల్లో చిక్కుకొని ఉంది. ఈ రెండేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో అక్కడ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో మార్చి 26న ఎస్తేర్ ఝావో అనే మహిళ, తన రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. అక్కడ తల్లీబిడ్డ ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. ఆ వెంటనే తల్లీబిడ్డను వేరు చేసి, ఎవరికి కేటాయించిన నిర్బంధ కేంద్రంలోకి వారిని తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో తానే తన కుమార్తెను చూసుకుంటానని, తన నుంచి వేరు చేయొద్దని ఆ తల్లి అధికారుల్ని వేడుకుంది. కానీ నిబంధనల పేరు చెప్పి, వారిని వేర్వేరు సంరక్షణా కేంద్రాలకు తరలించారు.
అప్పటినుంచి తన బిడ్డకు ఎలా ఉందో అని ఝావోకు కలవరం మొదలైంది. ఒకపక్క ఆమెకూడా క్వారంటైన్ కేంద్రంలోనే ఉండిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు పాప గురించి వైద్యులను పదేపదే అడిగితే.. ‘మీ పాప బాగానే ఉంది’ అంటూ చిన్న సందేశం పంపించారంతే. ‘నా బిడ్డ ఎలా ఉందో తెలుసుకుందామని అడిగితే.. బాగుందంటూ ఒక సందేశం పెట్టారు. ఒక్క ఫొటో కూడా పెట్టలేదు. నా మనసంతా ఆందోళనగా ఉంది. అసలు తను అక్కడ ఎలా ఉందో నాకు ఏమాత్రం తెలియడం లేదు. ఏదైనా అడిగితే షాంఘైలో ఉన్న నిబంధనల గురించి చెప్తున్నారు. పాజిటివ్ వచ్చిన పిల్లల్ని వారికి కేటాయించిన ప్రాంతంలో ఉంచాలి. పెద్దల్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించాలి. అక్కడకు వెళ్లి పిల్లలకు తోడుగా ఉండటానికి వీలు లేదు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీటికి తోడు తల్లిదండ్రులకు దూరంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న చిన్నారులు ఏడుస్తూ, మూలుగుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ సంగతి తెలిసి, ఆమె ఇంకా భయపడసాగింది. ఆ దృశ్యాలపై షాంఘై యంత్రాంగం కానీ, పిల్లల సంరక్షణా కేంద్రంగానీ స్పందించలేదు.
తల్లి పాలు తాగాల్సిన మూడునెలల పసికందును కూడా ఆ కేంద్రాల్లో ఉంచినట్లు ఆ చిత్రాలను బట్టి తెలుస్తోంది. మరికొన్నింటిలో సంరక్షణ కేంద్రాల్లో పెద్దలు లేకుండా పిల్లలు మాతమ్రే ఉన్నారు. వీటిని చూసిన ప్రజలు.. ‘ఇది చాలా భయంకరంగా ఉంది. అసలు ఇలాంటి నిబంధనలు ఎలా పెట్టారు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు నెల రోజుల నుంచి షాంఘైలో తాజా కొవిడ్ ఉద్ధృతి మొదలైంది. సుమారు 26 మిలియన్ల మంది ప్రజలు లాక్డౌన్లోకి వెళ్లిపోయారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూసుకుంటే అక్కడ కేసుల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం వైరస్ వ్యాప్తికి ఏ చిన్న అవకాశం కూడా ఉండకూడదని కఠినంగా వ్యవహరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో