
Wheat Exports: ఆహార ధాన్యాలు.. కరోనా వ్యాక్సిన్లలా కాకూడదు..!
అంతర్జాతీయ వేదికపై పశ్చిమ దేశాలకు భారత్ కౌంటర్
ఇంటర్నెట్డెస్క్: గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వస్తున్న వేళ.. భారత్ దీటుగా స్పందించింది. అవసరమైన వారికి ఆహార ధాన్యాలను అందించాలనే ఉద్దేశంతోనే ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఆహార ధాన్యాల సరఫరా కొవిడ్ వ్యాక్సిన్ల మాదిరిగా ఉండకూడదంటూ అంతర్జాతీయ వేదికగా పశ్చిమ దేశాలకు హితవు పలికింది.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ కాల్ టు యాక్షన్’ అనే అంశంపై జరిగిన మంత్రివర్గ సదస్సులో భారత్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అల్పాదాయ దేశాలు నేడు రెండు ఇబ్బందులను ఒకేసారి ఎదుర్కొంటున్నాయి. ఒకటి ధరల పెరుగుదల. రెండోది ఆహార ధాన్యాలను కొరత. భారత్ లాంటి దేశాలు కూడా సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ.. అన్యాయమైన ధరల పెరుగుదలను చవిచూస్తున్నాయి. కొన్ని దేశాలు అధిక నిల్వలను ఉంచుకోవడం, సరఫరాపై వస్తోన్న ఊహాగానాలే ఇందుకు కారణం. ఇదిలాగే కొనసాగడం మంచిది కాదు’’ అని చెప్పుకొచ్చారు.
నిషేధం అందుకే..
అంతర్జాతీయంగా గోధుమ ధరలు ఒక్కసారిగా పెరగడంతో దేశీయ ఆహార భద్రతతో పాటు పొరుగుదేశాలు, ఇతర దుర్భల దేశాలకు ముప్పు వాటిల్లనుందని తాము గుర్తించినట్లు మురళీధరన్ తెలిపారు. ‘‘దేశ ఆహార భద్రతపై ఈ ప్రభావం పడకుండా చూడటంతో పాటు అత్యంత అవసరమున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే గోధుమ ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించాం’ అని కేంద్రమంత్రి వెల్లడించారు. గోధుమలపై నిషేధం విధిస్తూనే కొన్ని సడలింపులు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ ప్రజల ఆహార అవసరాలు తీర్చేందుకు దిగుమతులు అత్యవసరమైన దేశాలు అభ్యర్థిస్తే తప్పకుండా వారికి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ సందర్భంగా పశ్చిమ దేశాలను ఉద్దేశిస్తూ భారత్ హెచ్చరికలు చేసింది. కొన్ని ధనిక దేశాలకు తమకు అవసరమున్న దాని కంటే అధికంగా కొవిడ్ వ్యాక్సిన్లను నిల్వ చేసుకోవడంతో పేద, మధ్యాదాయ దేశాల్లోని ప్రజలుకు కనీసం తొలి డోసు కూడా అందలేని పరిస్థితి నెలకొందని మురళీధరన్ గుర్తు చేశారు. ఆహార ధాన్యాల సరఫరా కొవిడ్ వ్యాక్సిన్ల మాదిరిగా కాకూడదని పశ్చిమ దేశాలకు సూచించింది. ‘‘ఆహార ధాన్యాల విషయలో సమానత్వం, స్థాయి, అందుబాటు ప్రాముఖ్యాన్ని మనమంతా గుర్తించాల్సిన అవసరం ఉంది’’ అని భారత్ పిలుపునిచ్చింది.
ఒత్తిడి, సంక్షోభంలో కూరుకుపోయిన దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని మురళీధరన్ ఈ సందర్భంగా తెలిపారు. ‘‘మా పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికాలో ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు భారత్ ప్రభుత్వం వేలాది మెట్రిక్ టన్నుల గోధుమలు, బియ్యం, పప్పు దినుసుల వంటి వాటిని పలు దేశాలకు పంపిస్తోంది. అఫ్గానిస్థాన్లో మానవతా సంక్షోభం నెలకొన్నప్పుడు 50వేల టన్నుల గోధుమలను పంపించాం. శ్రీలంక, మయన్మార్ దేశాలను కూడా కష్టసమయంలో ఆదుకుంటున్నాం. వసుధైక కుటుంబమే మా విధానం’’ అని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు ఏమయ్యాయంటే?..పిట్ట కథలు చెబుతున్నారు: సూర్యనారాయణ
-
World News
Putin: ‘నాటోలో ఆ రెండు దేశాల చేరికపై మాకేం సమస్య లేదు. కానీ..’ పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Business News
Stock Market: మదుపర్ల అప్రమత్తత.. మార్కెట్ల ఊగిసలాట
-
Politics News
Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్
-
Business News
Ease of doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలుగు రాష్ట్రాలు టాప్
-
Crime News
Andhra News: సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఫేక్ మెసేజ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?