Ukraine crisis: నిజమే.. ఆ పని అమెరికా ఎప్పుడో చేయాల్సింది..!
భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలపడుతోందని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పని
అగ్రరాజ్య లోపాన్ని అంగీకరించిన బ్లింకన్
ఇంటర్నెట్డెస్క్: భారత్-అమెరికా వ్యూహాత్మక బంధం బలపడుతోందని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ పని అమెరికా ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకొందని వెల్లడించారు. అమెరికాలోని కాంగ్రెస్ విచారణ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలపై బ్లింకన్ అభిప్రాయం చెప్పాలని సెనెటర్ విలియమ్ హెగర్టీ కోరారు.
బ్లింకన్ దీనికి స్పందిస్తూ ‘‘భారత్ విషయాన్నే చూడండి. రష్యాతో వారి సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్-రష్యా భాగస్వామ్యం ఏర్పడింది. ఆ సమయంలో భారత్తో భాగస్వామ్యానికి నాడు అమెరికా సిద్ధంగా లేదు. కానీ, ఇప్పుడు మనం ఆ దిశగా దృష్టిపెట్టాము. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడుతోందని నేను అనుకొంటున్నాను. దీనికి చైనానే ఓ పెద్ద కారణం’’ అని పేర్కొన్నారు.
అంతకు ముందు హెగర్టీ మాట్లాడుతూ ‘‘నేను చూసింది ఏమిటంటే.. స్వల్పకాలిక విభేదాలు తలెత్తినప్పుడు తీవ్ర నిరాశ చెందుతాము. అలాంటి వాటిని ఎదుర్కొంటూనే మీరు రోజు పనిచేస్తారు. కానీ, దీర్ఘకాలంలో భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తే.. 21వ శతాబ్దంలో మరింత మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. బ్లింకన్ కూడా హెగర్టీ అభిప్రాయాలతో చాలా వరకు ఏకీభవించారు. రానున్న దశాబ్దాల్లో ముందుకు వెళ్లడానికి ఈ భాగస్వామ్యం చాలా కీలకమైందని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా ఇప్పటికే భారత భాగస్వాములతో కలిసి చర్చలు జరిపేందుకు చాలా సమయం వెచ్చించారని పేర్కొన్నారు. భారత్ను జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలతో కలిసి పనిచేసేలా చేయడంలో క్వాడ్ది కీలక భూమికగా బ్లింకన్ అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
నడుం నొప్పి.. కుంగుబాటు.. తలనొప్పి
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు