QUAD: క్వాడ్కు భారత్ ఓ చోదక శక్తి: అమెరికా
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన ‘క్వాడ్ కూటమి’కి భారత్ ఓ చోదక శక్తి వంటిదని అమెరికా తెలిపింది.
వాషింగ్టన్: భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన ‘క్వాడ్ కూటమి’కి భారత్ ఓ చోదక శక్తి వంటిదని అమెరికా తెలిపింది. శుక్రవారం మెల్బోర్న్లో జరిగిన క్వాడ్ కూటమి మంత్రుల సమావేశం ముగిసిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ భేటీలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా అనుసరిస్తున్న బెదిరింపు ధోరణులను ‘క్వాడ్ కూటమి’ తప్పుబట్టింది. ఇలాంటి విధానాల నుంచి ఈ ప్రాంతానికి విముక్తి కల్పించేందుకు తమ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించింది. చైనా పేరు ప్రస్తావించకుండానే ఆ దేశ వైఖరిని నిరసించింది.
‘‘దక్షిణాసియా, హిందూ మహాసముద్రంలో భారత్ ఓ లీడర్. అలాగే ఆగ్నేయాసియాలో క్రియాశీలకంగా ఉన్న దేశంగా.. క్వాడ్కు ఓ చోదకశక్తి. ప్రాంతీయ అభివృద్ధికి ఓ ఇంజిన్ లాంటిది’’ అని శ్వేతసౌధం ప్రధాన డిప్యూటీ ప్రెస్ కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్కు రష్యాతో ఉన్న ముప్పుపై చర్చించేందుకూ అవకాశం దొరికిందన్నారు. రష్యా వైఖరి వల్ల ఉక్రెయిన్తో పాటు యావత్తు ప్రపంచానికి ఉన్న ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.
దక్షిణాసియాలో స్థిరత్వానికి భారత్తో కలిసి కృషి చేస్తామని అమెరికా ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్స్పేస్, మరింత బలమైన ఆర్థిక, సాంకేతికత రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపింది. అయితే, కేవలం ఏదో ఒక్క దేశం విధించే ఆంక్షలను భారత్ పట్టించుకోదని.. బహుముఖ, బహువిధ ఆంక్షలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించడంలో అమెరికా కొంత సంయమనం పాటించడం గమనార్హం.
రష్యా నుంచి భారత్ ఎస్-400 గగనతల క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్పై అమెరికా కాట్సా ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు.. వాటిపై అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి