Joe Biden: రష్యాపై చర్యల విషయంలో భారత్ స్పందన బలహీనం.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోన్న భారత్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కోపై చర్యలు తీసుకునేందుకు
వాషింగ్టన్: ఉక్రెయిన్పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోన్న భారత్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కోపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకొస్తుంటే.. దిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోందని అన్నారు. సీఈవోలతో జరిగిన బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘పుతిన్ గురించి నాకు బాగా తెలుసు. నాటోను విభజించగలనని బలంగా నమ్ముతూ పుతిన్ లెక్కలు కూడా వేసుకున్నారు. కానీ, ఆయన లెక్క తప్పింది. నాటో కూటమి ఐక్యంగా ఉంది. చరిత్రలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఇదంతా రష్యా వల్లే అనుకుంటున్నాను. అయితే, పుతిన్ దూకుడును అడ్డుకోవడంలో నాటో, అమెరికా మిత్ర దేశాలు, ఐరోపా సమాఖ్య, ఆసియా భాగస్వామ్య దేశాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. క్వాడ్ కూటమిలోనూ జపాన్, అస్ట్రేలియా దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ, ఒక్క భారత్ మాత్రమే ఈ విషయంలో ఎందుకో బలహీనంగా ఉంది. రష్యాపై ఆంక్షల వంటి చర్యలు తీసుకునే విషయంలో అస్థిరంగా ఉంది’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన సైనిక చర్య దాదాపు నెల రోజులుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పలు నగరాలపై రష్యా సేనలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెమ్లిన్ దురాక్రమణను అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపించాయి. మాస్కో నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా.. భారత్కు చౌక ధరకు చమురు విక్రయించేందుకు ముందుకొచ్చింది. దీనికి భారత్ కూడా అంగీకరించింది.
రష్యా నుంచి దాదాపు 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును డిస్కౌంట్లో కొనుగోలు చేసింది. కాగా.. ఈ పరిణామాలపై ఇటీవల స్పందించిన అమెరికా.. భారత్ ఒప్పందం ఆంక్షల పరిధిలోకి రాదని పేర్కొంది. అయితే, ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో తాము ఎటు పక్క నిలిచామో, రేపు చరిత్ర పుస్తకాల్లో తమ గురించి ఏమని రాస్తారో ప్రతి దేశమూ గుర్తుంచుకొని వ్యవహరించాలని హెచ్చరించింది.
అంతకుముందు.. రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి వేదికగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై ఓటింగ్కు కూడా భారత్ దూరంగా ఉంటూ వచ్చింది. తాము యుద్ధానికి వ్యతిరేకమన్న భారత్.. చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ పరిణామాలపైనే బైడెన్ తాజాగా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్