USA:పాక్ కవ్వింపు చర్యలను.. మోదీ చూస్తూ ఊరుకోరు: యూఎస్ నివేదిక
ప్రధాని మోదీ(Modi) నాయకత్వంలోని భారత్.. పాక్ రెచ్చగొట్టే చర్యలను చూస్తూ ఊరుకోదని అమెరికన్ నివేదిక ఒకటి అంచనా వేసింది. అలాగే భారత్,చైనా సంబంధాలపైనా స్పందించింది.
దిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ ప్రధాని నరేంద్రమోదీ(Modi) నాయకత్వంలో గతంలో కంటే దీటుగా సైనిక శక్తితో ప్రతిస్పందించగలదని అమెరికన్ ఇంటిలిజెన్స్ కమ్యూనిటీ(American intelligence community) అభిప్రాయపడింది. భారత్-పాకిస్థాన్(India and Pakistan), భారత్-చైనా(India and China) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఘర్షణలకు అవకాశం ఉందని అంచనా వేసింది. యూఎస్ కాంగ్రెస్కు సమర్పించిన నివేదికలో భాగంగా ఈ ముప్పు అంచనాలు వెలువరించింది.
‘సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ద్వైపాక్షిక చర్చలు జరుతున్నాయి. కానీ, 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సరిహద్దు వద్ద పెరిగిన సైనిక మోహరింపులు ఈ అణుశక్తుల మధ్య ఘర్షణ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అది యూఎస్ ప్రయోజనాలకు ముప్పుగా మారవచ్చు’ అని ఆ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో యూఎస్ జోక్యానికి పిలుపునిచ్చింది. గతంలోని సంక్షోభాలను బట్టి చూస్తే.. వాస్తవాధీన రేఖ వద్ద స్వల్ప స్థాయి ఆకస్మిక ఘర్షణలు అవకాశం ఉండొచ్చని తెలిపింది.
అలాగే భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ‘భారత్ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్థాన్(Pak)కు ఉంది. పాక్ రెచ్చగొట్టే చర్యలకు మోదీ నాయకత్వంలోని భారత్ గతంలో కంటే దీటుగా సైనికశక్తితో స్పందించగలదు. కశ్మీర్లో అశాంతి వంటి అంశాలు ఈ అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రికత్తలను పెంచుతున్నాయి’ అని ఆ నివేదిక పేర్కొంది. అయితే 2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణ ఇరు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులకు దోహదం చేయొచ్చని అంచనావేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.