Hypersonic Tech: హైపర్సోనిక్లో అమెరికాను మించిన భారత్, చైనా..!
ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా.. అధునాతన సాంకేతిక అంశాల్లో మాత్రం ఇతర దేశాల కంటే వెనుకబడిపోతోందని అమెరికా చట్టసభ సభ్యులు పేర్కొంటున్నారు.
తమ ఆధిపత్యం తక్కువేనన్న అమెరికన్ సీనియర్ సెనెటర్
వాషింగ్టన్: ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా.. అధునాతన సాంకేతిక అంశాల్లో మాత్రం ఇతర దేశాల కంటే వెనుకబడిపోతోందని ఆ దేశ చట్టసభ సభ్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హైపర్సోనిక్ సాంకేతికత విషయంలో అమెరికా కంటే చైనా, భారత్, రష్యా దేశాలే ఎంతో ముందున్నాయన్నారు. ఈ మూడు దేశాలతో పోలిస్తే హైపర్సోనిక్ సాంకేతికతలో అమెరికా ఆధిపత్యం తక్కువేనని స్పష్టం చేశారు. అమెరికా ఎగువసభలో అత్యంత శక్తివంతమైన రక్షణ కమిటీ ఛైర్మన్గా ఉన్న సీనియర్ సెనెటర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘సాంకేతికాభివృద్ధిలో అమెరికా మెరుగైన దశలోనే ఉంది. సాంకేతిక పరిజ్ఞానంలో ముందడుగు వేశాం. కానీ, హైపర్సోనిక్ విషయంలో అలా కాదు. చైనా, భారత్, రష్యా దేశాలు ఆ విషయంలో ఎంతో ముందున్నాయి’ అని సెనెట్ (అమెరికా ఎగువసభ) సైనిక సేవల కమిటీ ఛైర్మన్ జాక్ రీడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య ద్వైపాక్షిక పోటీ కాదన్న ఆయన.. ప్రపంచచరిత్రలోనే తొలిసారిగా చైనా, రష్యా, అమెరికా దేశాల మధ్య త్రైపాక్షిక అణుపోటీని ఎదుర్కోబోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సవాలును ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అమెరికా రక్షణశాఖ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టనున్న లాప్లాంటేకి జాక్ రీడ్ సూచించారు.
దీనికి స్పందించిన లాప్లాంటే.. ‘ఓవైపు చైనాతో అన్ని విధాల ముప్పే. మరోవైపు ప్రాంతీయ ఆధిపత్యంపై రష్యా దృష్టి సారించింది. ఇవి రెండూ హానికరమైనవే. వీటితోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర అస్తిత్వ బెదిరింపు ధోరణులు తీవ్ర ముప్పుగా పరిగణించాయి. హైపర్సోనిక్పై 2010, 2011లలో డీఏపీఆర్ఏ, ఎయిర్ఫోర్స్ సంయుక్త ప్రయోగాలు నిర్వహించాయి. ఆ రెండూ విఫలం కావడంతో ఆ ప్రయోగాలను అమెరికా నిలిపివేసింది. చైనా, రష్యాలు మాత్రం అటువంటి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. అందుకే మనం కూడా ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉండాలి. వరుస ప్రయోగాల నుంచే నేర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంది’ అని లాప్లాంటే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నూతన సాంకేతికతపై అమెరికా ఎన్నో ఏళ్లుగా దృష్టి సారించిందన్న ఆయన.. ఆ సామర్థ్యాలను ఆయుధ వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా సాంకేతికతను నిరంతరం నవీకరించేందుకు ఇతర విభాగాలతో కలిసి ముందుకెళ్తామని మరో సెనెటర్ అడిగిన ప్రశ్నకు లాప్లాంటే సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు