Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్ఫోర్స్లో కీలక పదవి..!
అమెరికా వైమానిక దళంలో మన తెలుగు వ్యక్తి రాజా చారి (Raja Chari)కి కీలక పదవి దక్కనుంది. అతడిని బ్రిగేడియర్ జనరల్గా జో బైడెన్ నామినేట్ చేశారు.
వాషింగ్టన్: భారత అమెరికన్, తెలుగు వ్యక్తి రాజాచారి (Raja Chari) అగ్రరాజ్యంలో మరో అరుదైన ఘనత అందుకోబోతున్నారు. అమెరికా ఎయిర్ఫోర్స్ (US Airforce)లో బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్ పదవికి రాజాచారిని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నామినేట్ చేశారు. ఈ మేరకు యూఎస్ రక్షణ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ నామినేషన్ను సెనేట్ ఆమోదించాల్సి ఉంది.
అమెరికా (America) ఎయిర్పోర్స్లో బ్రిగేడియర్ జనరల్ అనేది వన్ స్టార్ జనరల్ ఆఫీసర్ ర్యాంక్ హోదా. దీని తర్వాత మేజర్ జనరల్ హోదా దక్కుతుంది. 45 ఏళ్ల రాజా చారి ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో కల్నల్ హోదాలో ఉన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో వ్యోమగామిగా, క్రూ-3 కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది అంతరిక్ష యానం కూడా పూర్తి చేసుకున్నారు.
ఎవరీ రాజాచారి..
రాజాచారి (Raja Chari) తండ్రి శ్రీనివాస్ వి.చారి హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికా దేశస్థురాలైన పెగ్గీ ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నారు. వీరికి రాజాచారి 1977లో జన్మించారు. రాజా.. స్కాన్సిన్లోని మిల్వాకీలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లోనూ విద్యనభ్యసించారు. 2017లో నాసా (NASA) ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్కు ఎంపికయ్యారు. 2021లో నాసా, స్పేస్ఎక్స్ సంయుక్తంగా ప్రయోగించిన ‘క్రూ-3’ మిషన్లో రాజాచారి ఓ సభ్యుడు. ఫాల్కన్ 9 రాకెట్లో నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) బయల్దేరగా.. ఈ మిషన్కు రాజాచారి కమాండర్గా వ్యవహరించడం విశేషం. కొన్ని నెలల పాటు ఈ బృందం అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు పూర్తి చేసుకుని గతేడాది మే నెలలో భూమిపైకి తిరిగొచ్చింది. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం.
ఇదిలా ఉండగా.. చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్’ మిషన్ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అన్నీ అనుకున్నట్లే జరిగితే 2024లో రాజాచారి జాబిల్లిపై కాలుమోపే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు