Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్ఫోర్స్లో కీలక పదవి..!
అమెరికా వైమానిక దళంలో మన తెలుగు వ్యక్తి రాజా చారి (Raja Chari)కి కీలక పదవి దక్కనుంది. అతడిని బ్రిగేడియర్ జనరల్గా జో బైడెన్ నామినేట్ చేశారు.
వాషింగ్టన్: భారత అమెరికన్, తెలుగు వ్యక్తి రాజాచారి (Raja Chari) అగ్రరాజ్యంలో మరో అరుదైన ఘనత అందుకోబోతున్నారు. అమెరికా ఎయిర్ఫోర్స్ (US Airforce)లో బ్రిగేడియర్ జనరల్ గ్రేడ్ పదవికి రాజాచారిని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) నామినేట్ చేశారు. ఈ మేరకు యూఎస్ రక్షణ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ నామినేషన్ను సెనేట్ ఆమోదించాల్సి ఉంది.
అమెరికా (America) ఎయిర్పోర్స్లో బ్రిగేడియర్ జనరల్ అనేది వన్ స్టార్ జనరల్ ఆఫీసర్ ర్యాంక్ హోదా. దీని తర్వాత మేజర్ జనరల్ హోదా దక్కుతుంది. 45 ఏళ్ల రాజా చారి ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో కల్నల్ హోదాలో ఉన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో వ్యోమగామిగా, క్రూ-3 కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది అంతరిక్ష యానం కూడా పూర్తి చేసుకున్నారు.
ఎవరీ రాజాచారి..
రాజాచారి (Raja Chari) తండ్రి శ్రీనివాస్ వి.చారి హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికా దేశస్థురాలైన పెగ్గీ ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నారు. వీరికి రాజాచారి 1977లో జన్మించారు. రాజా.. స్కాన్సిన్లోని మిల్వాకీలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లోనూ విద్యనభ్యసించారు. 2017లో నాసా (NASA) ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాస్కు ఎంపికయ్యారు. 2021లో నాసా, స్పేస్ఎక్స్ సంయుక్తంగా ప్రయోగించిన ‘క్రూ-3’ మిషన్లో రాజాచారి ఓ సభ్యుడు. ఫాల్కన్ 9 రాకెట్లో నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) బయల్దేరగా.. ఈ మిషన్కు రాజాచారి కమాండర్గా వ్యవహరించడం విశేషం. కొన్ని నెలల పాటు ఈ బృందం అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు పూర్తి చేసుకుని గతేడాది మే నెలలో భూమిపైకి తిరిగొచ్చింది. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం.
ఇదిలా ఉండగా.. చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్’ మిషన్ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అన్నీ అనుకున్నట్లే జరిగితే 2024లో రాజాచారి జాబిల్లిపై కాలుమోపే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ వల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి’: నౌకలోని భారత సిబ్బందికి బెడైన్ ప్రశంసలు
నౌక ఢీ కొనడంతో వంతెన కుప్పకూలిన అనూహ్య ఘటన అమెరికా(USA)లో చోటుచేసుకుంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. -
256 ఏళ్ల బ్రిటిష్ మ్యూజియం చరిత్రకు మచ్చ.. 1,800 పురాతన వస్తువుల చోరీ!
British Museum: లండన్లోని ప్రఖ్యాత బ్రిటిష్ మ్యూజియంలో 1,800 వస్తువులు చోరీకి గురైనట్లు నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. -
అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!
Baltimore bridge collapse: బాల్టిమోర్లో కుప్పకూలిన వంతెన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. -
అమెరికాలో కుప్పకూలిన వంతెన
అమెరికాలోని బాల్టిమోర్లో భారీ ప్రమాదం జరిగింది. సరకు రవాణా నౌక పిల్లర్ను ఢీకొనడంతో నదిపై ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నీటిలో పడిపోయాయి. -
అసాంజేకు ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను వెంటనే అమెరికాకు అప్పగించాల్సిన అవసరం లేదని బ్రిటన్ కోర్టు స్పష్టం చేసింది. -
న్యూజిలాండ్ పార్లమెంట్పై చైనా హ్యాకర్ల ఆపరేషన్!
తమ పార్లమెంటే లక్ష్యంగా చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న హ్యాకర్లు 2021లో రహస్య ఆపరేషన్ చేపట్టారని న్యూజిలాండ్ ఆరోపించింది. -
బెల్జియం ప్రధానికి మోదీ ఫోను
బెల్జియం ప్రధానమంత్రి అలెగ్జాండర్ డి క్రుతో ప్రధాని మోదీ మంగళవారం ఫోనులో సంభాషించారు. పశ్చిమాసియాతో పాటు రష్యా- ఉక్రెయిన్ వివాదంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు మద్దతు తదితర అంశాలపై ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. -
బాల్టిక్ ప్రాంతంలో జీపీఎస్ జామింగ్
బాల్టిక్ సముద్ర తీర ప్రాంతంలోని ఐరోపా దేశాల్ని జీపీఎస్ సిగ్నల్ సమస్య పీడిస్తోంది. గగనతలంలో ఉన్న విమానాలకు నకిలీ సంకేతాలు పంపి వాటి జాడను తప్పుగా చూపెడుతున్నాయంటూ ప్రముఖ ‘న్యూస్వీక్’ వార్తా సంస్థ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. -
రంజాన్కు కాల్పుల విరమణ లేనట్లే
గాజాలో కాల్పుల విరమణ కోసం రెండువైపుల నుంచి వచ్చిన డిమాండ్లను ఇరుపక్షాలు పరస్పరం అంగీకరించలేదు. -
ఆ తండ్రికి రూ.వందల కోట్ల ఆస్తి.. సామాన్యుడిలా పెరిగిన కుమారుడు
మనిషి సాధారణ వ్యక్తిగా పెరిగితేనే జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తాడనేది జాంగ్ యుడాంగ్ అభిప్రాయం. -
ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి అండగా ఉంటాం : జైశంకర్
సార్వభౌమత్వ పరిరక్షణలో ఫిలిప్పీన్స్కు భారత్ పూర్తి అండగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. -
చైనీయులే లక్ష్యంగా పాక్లో ఉగ్రదాడి!
పాకిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో అయిదుగురు చైనీయులు, ఓ పాకిస్థానీ సహా నలుగురు ఉగ్రవాదులు మరణించారు. -
భూగర్భ డ్రైనేజీలో 36 గంటలు.. దాక్కొన్నాడా.. దబాలున పడ్డాడా!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో భూగర్భ డ్రైనేజీలోకి దిగిన ఓ యువకుడు దాదాపు 36 గంటలు అందులోనే చిక్కుకుపోయాడు. -
రామకృష్ణ మిషన్ అధ్యక్షుడి కన్నుమూత
రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద (95) మంగళవారం రాత్రి కోల్కతాలో కన్నుమూశారు. వయో సంబంధిత రుగ్మతలతో ఆయన తుదిశ్వాస విడిచారు. -
సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. -
పుడమిని తాకిన శక్తిమంతమైన సౌరతుపాను
ఆరేళ్లలో ఎన్నడూ లేనంత శక్తిమంతమైన సౌర తుపాను తాజాగా భూమిని తాకింది. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ పేర్కొంది. -
మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా.. తొలిసారి ప్రాతినిధ్యం!
ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్ యూనివర్స్ (Miss Universe 2024) పోటీల్లో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొననుంది.
తాజా వార్తలు (Latest News)
-
volunteers: ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
-
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్గా మారిన ఫొటో
-
మెదక్ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
-
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM