USA: కోడల్ని వెతికి మరీ చంపిన ఇండో-అమెరికన్ వృద్ధుడు!
తన కుమారుడికి విడాకులు ఇవ్వాలని భావించిన కోడల్ని వెతికి మరీ కాల్చి చంపాడో వృద్ధుడు. అమెరికాలోని ఓ మాల్ పార్కింగ్ లాట్లో కోడల్ని చంపిన కేసులో ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు.
శాన్ఫ్రాన్సిస్కో: తన కుమారుడికి విడాకులు ఇవ్వాలని భావించిన కోడల్ని వెతికి మరీ కాల్చి చంపాడో వృద్ధుడు. అమెరికాలోని ఓ మాల్ పార్కింగ్ లాట్లో కోడల్ని చంపిన కేసులో ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో రాష్ట్రంలో శాంజోస్లో వారం రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసాంజ్ వాల్మార్ట్లో పనిచేస్తుండగా.. ఆమెను వెతుక్కుంటూ 150 మైళ్ల దూరం ప్రయాణించిన ఆ వృద్ధుడు తన కోడల్ని కాల్చి చంపినట్టు సమాచారం. అయితే, మృతురాలి మేనమామ ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేసిన అక్కడి పోలీసు అధికారులు సీతల్ సింగ్ దోసాంజ్ (74)ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.
ఈ దారుణానికి ముందు గుర్ప్రీత్ తన మేనమామకు ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడి పరిస్థితిని ఆయనకు చెబుతుండగానే ఆమె వైపు దూసుకొచ్చిన వృద్ధుడు గుర్ప్రీత్ను కాల్చి చంపినట్టు సమాచారం. సీతల్ తన కోసం వెతుకుతున్నాడని, భయంగా ఉందంటూ గుర్ప్రీత్ తన మేనమామకు ఫోన్లో చెప్పినట్టు దర్యాప్తు అధికారులు తమ నివేదికలో తెలిపారు. వాల్మార్ట్లో పని నుంచి విరామం తీసుకొని బయట తన కారు వద్దకు వచ్చిన ఆమె.. లాట్లో సీతల్ డ్రైవింగ్ చేస్తున్నట్టు చూశానని, తనను వెతుక్కుంటూ 150 మైళ్ల దూరం వచ్చాడని తన మేనమామకు వివరించింది. అయితే, తన కారు వద్ద ఉన్న గుర్ప్రీత్ వద్దకు దూసుకొస్తున్న సమయంలో ఆమె భయంతో గట్టిగా కేకలు వేసిందని ఆయన చెప్పినట్టు తెలిపారు. గుర్ప్రీత్ చివరి మాటలు అవేనని.. ఆ తర్వాత ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయిందని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగి ఐదు గంటల తర్వాత వాల్మార్ట్లో పనిచేసే తోటి ఉద్యోగి గుర్ప్రీత్ మృతదేహాన్ని అదే కారులో గుర్తించారు. ఆమె శరీరంపై రెండు బుల్లెట్ గాయాలు ఉండగా.. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఫ్రెస్నోలో ఆమె భర్త, మామ నివాసం ఉంటుండగా.. శాంజోస్లో తన మేన కోడలు ఉంటోందని ఆయన తెలిపారు. భర్తతో విడాకులు తీసుకొనే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సీతల్ను అనుమానితుడిగా గుర్తించారు. ఆ మరుసటి రోజు ఉదయం అతడి నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అతడి ఇంట్లో సోదాలు చేయగా.. ఒక పిస్టోల్ సీజ్ చేసినట్టు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్