USA: స్నేహితుడి కోసం ఎయిర్పోర్టుకు వెళ్లి.. తనువు చాలించిన ప్రవాసాంధ్రుడు
అమెరికాలోని బోస్టన్ ఎయిర్పోర్టు (Boston International Airport)లో జరిగిన ప్రమాదంలో విశ్వచంద్ కోళ్ల (Vishwachand Kolla) అనే ప్రవాసాంధ్రుడు ప్రాణాలు కోల్పోయారు. ఆయన అమెరికాలోని టకెడ ఫార్మాస్యూటికల్ సంస్థలో డేటా అనలిస్ట్గా పని చేస్తున్నారు.
న్యూయార్క్: అమెరికా (USA)లోని బోస్టన్ (Boston)లో దారుణం చోటు చేసుకుంది. భారత్ నుంచి వస్తున్న తన స్నేహితుడిని పికప్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లిన ప్రవాసాంధ్రుడుప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోస్టన్లోని లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని ఆంధ్రప్రదేశ్కు చెందిన విశ్వచంద్ కోళ్ల (47)గా గుర్తించారు. ఆయన అమెరికాలోని టకెడ ఫార్మాస్యూటికల్ సంస్థలో డేటా అనలిస్ట్గా పని చేస్తున్నారు.
భారత్ నుంచి ఓ సంగీత వాయిద్య కళాకారుడైన తన స్నేహితుడు వస్తున్నాడని తెలుసుకొని.. ఆయన్ని పికప్ చేసుకునేందుకు విశ్వచంద్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. తన ఎస్యూవీ వాహనంలో విమానాశ్రయం బయట టెర్మినల్-బి వద్ద వేచి చూస్తుండగా.. అటువైపుగా వస్తున్న డార్ట్మౌత్ ట్రాన్స్పోర్ట్కు చెందిన వాహనం.. ఎస్యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. సమీపంలో ఉన్న నర్సు వెంటనే స్పందించి విశ్వచంద్ను కారునుంచి బయటకి తీసి పరీక్షించింది. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు డార్ట్మౌత్ వాహనం నడిపిన మహిళా డ్రైవర్ను ప్రశ్నించి.. పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న మస్సాచుసెట్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
మరోవైపు డార్ట్మౌత్ వాహనంలోని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు మరో వాహనంలోకి మార్చారు. ఈ ఘటనపై డ్రాట్మౌత్ ట్రాన్స్పోర్టు విచారం వ్యక్తం చేసింది. కేసు విషయంలో మస్సాచుసెట్స్ పోలీసులకు సహకరిస్తామని తెలిపింది. మరోవైపు విశ్వచంద్ పని చేస్తున్న ఫార్మా సంస్థ ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. నిబద్ధత కలిగిన ఉద్యోగిని కోల్పోవడం బాధాకరంగా ఉందంటూ మెయిల్ చేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. మరోవైపు విశ్వచంద్ స్నేహితులు, బంధువులు ‘గో ఫండ్ మి’ పేరిట వెబ్పేజీని క్రియేట్ చేశారు. దీని ద్వారా ఇప్పటి వరకు 4,06,151 అమెరికన్ డాలర్లు పోగు చేశారు. దీనిని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు