USA: భారతి సంతతి మహిళపై జాతి వివక్ష..కోర్టులో దావా
అమెరికా (USA) లో జాతి వివక్షకు గురయ్యానంటూ భారత సంతతికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మీ బాలచంద్ర (Lakshmi Balachandra)ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె కోర్టులో దావా వేశారు.
న్యూయార్క్: అమెరికా(USA)లో తాను జాతి వివక్షకు గురైనట్లు భారత సంతతికి చెందిన లక్ష్మీ బాలచంద్ర (Lakshmi Balachandra) ఆవేదన వ్యక్తం చేశారు. మసాచుసెట్స్లోని బాబ్సన్ బిజినెస్ కళాశాల (Babson College)లో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఆమె.. జాతి, స్త్రీ వివక్షకు గురయ్యానంటూ కోర్టులో దావా వేశారు. వివక్ష కారణంగా ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోయాయని, మానసికంగా కుంగిపోయానని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ది బోస్టన్ గ్లోబ్ వార్తాపత్రిక కథనం వెల్లడించింది.
లక్ష్మీ బాలచంద్ర తన దావాలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆమె 2012లో బాబ్సన్ కళాశాలలో ఉద్యోగినిగా చేరారు. అప్పటికే అక్కడ పని చేస్తున్న ప్రొఫెసర్ అండ్రూ కార్బెట్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. అమెకు అనుభవమున్న, పట్టున్న సబ్జెక్టులు కాకుండా ఇతర పాఠ్యాంశాలను బోధించమని ఆండ్రూ ఆమెకు చెప్పేవాడు. గతంలో ఆమెకు ఎమ్ఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఆమెకు ప్రాధాన్యత లేని క్లాసులు బోధించమని చెప్పేవాడు. దీంతో విసుగు చెందిన ఆమె సమస్యను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇక్కడ మహిళలను తక్కువ చేసి చూస్తున్నారని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని లక్ష్మీ బాలచంద్ర తన దావాలో పేర్కొన్నారు. అంతేకాకుండా తెల్లజాతి పురుషులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
పరిశోధనలకు, ఇష్టాయిష్టాలకు, గతంలో పనిచేసిన అనుభవానికి విలువ ఇవ్వలేదని, ఉన్నతస్థానాలకు వెళ్లకుండా అణగదొక్కేశారని లక్ష్మీ బాలచంద్ర ఆరోపించారు. అవకాశాలు ఎప్పుడొచ్చినా తెల్లవారికే ప్రాధాన్యత ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడిన ఆండ్రూ కార్బెట్పై జాతి, స్త్రీ వివక్ష కేసులు నమోదు చేసినట్లు లక్ష్మీ బాలచంద్ర తరఫు న్యాయవాది మోనికా సాహ్ వెల్లడించారు. దీనిపై బాబ్సన్ కళాశాల కూడా స్పందించింది. సలహాలను, ఫిర్యాదులను చాలా సీరియస్గా తీసుకుంటామని, నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొంది. ఏదైన సమస్య ఏర్పడితో కూలంకషంగా చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. 2019 తర్వాత సెలవులపై ఆ సంస్థ నుంచి బయటకొచ్చిన లక్ష్మీ బాలచంద్ర ప్రస్తుతం నేషనల్ సైన్స్ ఫౌండేషన్లో ఫెలోషిప్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్