Nepal: ఫేస్బుక్ లైవ్లో.. నేపాల్ విమానం కూలిన దృశ్యాలు
నేపాల్ విమానం కూలుతున్న సమయంలో అందులో ఓ ప్రయాణికుడు ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్లో ఉన్నాడు. విమానం కూలిన భయానక దృశ్యాలు అందులో రికార్డయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ (Nepal)లో ఆదివారం చోటుచేసుకున్న విమాన దుర్ఘటన (Plane Crash)కు సంబంధించి మరో వీడియో బయటికొచ్చింది. రాజధాని కాఠ్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్లైన్స్ (Yeti Airlines) విమానం నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ భీకర ప్రమాద దృశ్యాలు ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్లో రికార్డయ్యాయి.
ఈ విమానంలో ఐదుగురు భారతీయులున్న విషయం తెలిసిందే. వీరిలో ఒకరైన సోను జైస్వాల్.. విమానంలో కిటికీ పక్కన కూర్చుని తన ఫోన్లో ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ (Live Streaming) చేసి గాల్లో నుంచి సిటీ అందాలను చూపించారు. సరిగ్గా అదే సమయంలో విమానం కుప్పకూలింది. భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. అవన్నీ లైవ్ స్ట్రీమింగ్లో రికార్డయ్యాయి. అప్పటిదాకా ప్రకృతి అందాలను చూస్తూ చిరునవ్వులు చిందించిన ప్రయాణికులు.. విమానం కూలిపోవడంతో హాహాకారాలు చేయడం ఆ వీడియోలో రికార్డయ్యింది. సోను జైస్వాల్ ఫేస్బుక్ ఖాతాలో కన్పించిన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటికే ఈ విమానం కూలడానికి (Plane Crash) ముందు గాల్లో నియంత్రణ కోల్పోయిన దృశ్యాలు బయటికొచ్చిన విషయం తెలిసిందే.
ఒక్క ప్రాణమూ మిగల్లేదు..
యతి ఎయిర్లైన్స్ (Yeti Airlines)కు చెందిన ఏటీఆర్ 72 విమానం కాఠ్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని ఫొఖారాకు బయల్దేరిన 20 నిమిషాలకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 25 నిమిషాలు మాత్రమే. అంటే మరో 5 నిమిషాల్లో విమానం గమ్యం చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 72 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో ఐదుగురు భారతీయులు సహా 10 మంది విదేశీయులు. ఈ దుర్ఘటనలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని నేపాల్ (Nepal) ఆర్మీ సోమవారం వెల్లడించింది. ‘‘ప్రమాద స్థలం నుంచి ఏ ఒక్కరినీ ప్రాణాలతో కాపాడలేదు’’ అని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్ భండారీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలం నుంచి ఇప్పటివరకు 68 మృతదేహాలను వెలికితీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.