England: ఇంగ్లండ్ ప్రవాసుల్లో.. భారతీయులే అత్యధికం
ఇంగ్లండ్, వేల్స్లో నివసిస్తోన్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారేనని తాజా నివేదిక వెల్లడించింది. అక్కడ నివసిస్తోన్న వారిలో 1.5శాతం మంది భారతీయులేనని తెలిపింది.
లండన్: విదేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా క్రమంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్లోనూ భారతీయుల జనాభా పెరిగినట్లు తాజా నివేదిక పేర్కొంది. అక్కడ నివసిస్తోన్న వారిలో 1.5శాతం మనవారేనని తెలిపింది. ఇంగ్లండ్, వేల్స్లో నివసిస్తోన్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారేనని తాజా నివేదిక వెల్లడించింది.
బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయ (ఓఎన్ఎస్) నివేదిక-2021 ప్రకారం, ఇంగ్లండ్, వేల్స్లో నివసిస్తోన్న వారిలో బ్రిటన్ బయట జన్మించిన వారి సంఖ్య 2011లో 75లక్షలుగా ఉంది. 2021 నాటికి అది కోటికి చేరుకుంది. గడిచిన పదేళ్లలో వీరి సంఖ్య 25లక్షలు (13శాతం నుంచి 16శాతానికి) పెరిగింది. ఈ జాబితాలో భారత మొదటి స్థానంలో ఉంది. గతేడాది అక్కడ నివాసమున్న వారిలో 9,20,000 మంది భారతీయులుండగా.. తర్వాతి స్థానంలో పోలండ్ (7,43,000), పాకిస్థాన్ (6,24,000)లు ఉన్నట్లు ఓఎన్ఎస్ వెల్లడించింది. 2011లో భారతీయుల సంఖ్య 6,94,000గా ఉంది.
లండన్లో నివసించే వారిలో ప్రతి పది మందిలో నలుగురు (40శాతం) బ్రిటన్ బయట జన్మించినవారే కావడం విశేషం. అయితే, గడిచిన పదేళ్లలో బ్రిటన్కు వలస వచ్చిన వారి జాబితాలో మాత్రం రొమేనియా తొలిస్థానంలో ఉంది. 2011లో వారి సంఖ్య 80 వేలు ఉండగా.. ప్రస్తుతం 5లక్షల 39వేలకు చేరింది. రొమేనియా నుంచి పనికోసం వచ్చే పౌరులపై ఉన్న ఆంక్షలను 2014లో ఎత్తివేసిన తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అంచనా. వీటితోపాటు ఐర్లాండ్, బంగ్లాదేశ్, నైజీరియా, జర్మనీ, దక్షిణాఫ్రికా నుంచి వలసలు పెరగగా.. అమెరికా, జమైకా నుంచి తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది. ఇలా విదేశాల నుంచి బ్రిటన్కు వలసలు ఏవిధంగా ఉన్నాయనే విషయం ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోందని సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ జోన్ వ్రాత్స్మిత్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. -
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?