Ukraine Stand: భారత్ ఎంచుకున్న మార్గానికి ఏ దేశం ఆమోదం అక్కర్లేదు..!
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో విదేశీ విధానంపై తన వైఖరిని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ విషయంలో మరోసారి తన వైఖరి స్పష్టంచేసిన భారత్
దిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో విదేశీ విధానంపై తన వైఖరిని భారత్ మరోసారి స్పష్టం చేసింది. తాము ఎంచుకున్న మార్గానికి ఏ దేశం ఆమోదం అవసరం లేదని ఉద్ఘాటించింది. అంతేకాకుండా ఇతర దేశాల ఒత్తిడిని అనుకరిస్తూ ప్రపంచదేశాలను సంతోషపెట్టలేమని కుండబద్దలు కొట్టింది. ఉక్రెయిన్ విషయంలో భారత స్పష్టమైన వైఖరిని ప్రదర్శించడంలేదంటూ పాశ్చాత్య దేశాలు చేస్తోన్న విమర్శల నేపథ్యంలో భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా పేర్కొంది.
‘మనం ఎవరు అన్న విషయంలో దృఢ విశ్వాసంతో ఉండాలి. ఇతరులను అనుకరిస్తూ ప్రపంచాన్ని సంతోషపెట్టడం కంటే మనం ఎవరనే విషయంపై ప్రపంచ దేశాలు నిమగ్నమవడం మంచిదని భావిస్తున్నాను’ అని దిల్లీలో జరుగుతోన్న రైసినా (Raisina Dialogue) అంతర్జాతీయ సదస్సులో భారత విదేశాంగమంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతరులు దిశానిర్దేశం చేయడం, ఇతరుల నుంచి ఆమోదం పొందడమనే కాలం ఎప్పుడో చెల్లిపోయిందని అన్నారు. స్వాతంత్ర్యం పొంది 75ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇతరుల ఆమోదం పొందాలనే మునుపటి ఆలోచన నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని విదేశాంగమంత్రి ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు.
ఉక్రెయిన్ సంక్షోభం ఐరోపాకు మేలుకొలుపు అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇదే సదస్సులో పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో భారత వైఖరిపై వస్తోన్న విమర్శలను తిప్పికొట్టిన ఆయన.. ఎవరి ప్రాధాన్యాన్ని బట్టి వారు వ్యవహరించడం సర్వసాధారణమన్నారు. ఆసియాలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఐరోపా దేశాలకు సూచించిన జయశంకర్.. ఉక్రెయిన్ పరిణామం ఐరోపాకు గుర్తు చేస్తోందన్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్ విషయంలో రష్యా దాడులను విరమించి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తూనే ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా