Indonesia: ఇండోనేసియా భూకంపం.. 252కి చేరిన మృతుల సంఖ్య
ఇండోనేసియాలోని జావా ద్వీపంలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
జకార్తా: ఇండోనేసియాలో అత్యధిక జనాభా కలిగిన జావా ద్వీపంలో భూకంపం సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 252 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. భవన శిథిలాల కింద నేడు మరిన్ని మృతదేహాలను గుర్తించారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. 600 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఇంకా 151 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
రాజధాని జకార్తాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చియాంజుర్ కేంద్రంగా 5.6 తీవ్రతతో సోమవారం ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు చియాంజుర్ ప్రాంతం తీవ్రంగా ధ్వంసమైంది. భవనాలు కూలిపోయి అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. క్షతగాత్రులతో స్థానిక ఆసుపత్రిలన్నీ నిండిపోయాయి. దీంతో చాలా మందికి ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలుస్తోంది. ఇండోనేసియాలో చాలా మంది విద్యార్థులు సాధారణ తరగతులు ముగిసిన తర్వాత ఇస్లామిక్ పాఠశాలల్లో అదనపు తరగతులకు హాజరవుతారు. ఈ విపత్తుతో చియాంజుర్ ప్రాంతంలో 13వేల మంది నిరాశ్రయులయ్యారు. భూకంప ప్రభావిత ప్రాంతాన్ని ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం పరిశీలించారు.
మోదీ దిగ్భ్రాంతి..
ఇండోనేసియా భూకంప ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇండోనేసియాకు భారత్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఇండోనేసియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ దేశం ‘రింగ్ ఆఫ్ పసిఫిక్ ఫైర్’లో ఉంది. ఇక్కడ సముద్రం అడుగున చాలా అగ్నిపర్వతాలు ఉంటాయి. దీంతో ఇవి బద్ధలైనప్పుడు భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమ సమత్రా ప్రావిన్సులో 6.2 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 25 మంది చనిపోయారు. 460 మంది గాయపడ్డారు. గత ఏడాది జనవరిలో సులావేసిలో భూకంప ధాటికి 100మందికి పైగా చనిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!