Iranian Drones: రష్యాకు డ్రోన్లు సరఫరా చేశాం.. అంగీకరించిన ఇరాన్!
రష్యాకు డ్రోన్ల సరఫరా విషయంపై ఇరాన్ మాట మార్చింది! మాస్కోకు ఈ ఆయుధాలను సరఫరా చేసినట్లు మొదటిసారి అంగీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిర్అబ్దోల్లాహియాన్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
టెహ్రాన్: రష్యాకు డ్రోన్(Drones)ల సరఫరా విషయంపై ఇరాన్(Iran) మాట మార్చింది! మాస్కోకు ఈ ఆయుధాలను సరఫరా చేసినట్లు మొదటిసారి అంగీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిర్అబ్దోల్లాహియాన్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్పై రష్యా(Russia) సైనిక చర్య ప్రారంభానికి నెలల ముందే ఆ దేశానికి పరిమిత సంఖ్యలో డ్రోన్లు(Iran Drones) సరఫరా చేసినట్లు ఆయన టెహ్రాన్లో విలేకరులతో చెప్పారు. ఉక్రెయిన్పై యుద్ధంలో మాస్కోకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలను ఇరాన్ అధికారులు గతంలో ఖండించారు. ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ సైతం ఇటీవలే ఈ ఆరోపణలను పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే ఇరాన్ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇటీవల ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు ఆయా నగరాలపై రష్యా.. డ్రోన్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇంధన వసతులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. పుతిన్ సైన్యం ఇరాన్ డ్రోన్లను వాడుతోందని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఆరోపించగా.. తమ సైన్యం అటువంటి ఆయుధాలు వాడుతున్నట్లు తమకు తెలియదని క్రెమ్లిన్ వెల్లడించింది. ఇరాన్ సైతం.. రష్యాకు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయడం లేదని చెబుతూ వస్తోంది. అయితే, డ్రోన్లను సరఫరా చేసినట్లు తాజాగా అంగీకరించిన ఇరాన్ మంత్రి.. ఉక్రెయిన్లో వాటి వినియోగం గురించి మాత్రం తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ డ్రోన్లను ఉపయోగించినట్లు ఉక్రెయిన్ వద్ద ఆధారాలు ఉంటే.. మాకు అందజేయాలి. నిజమని తేలితే.. ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని