Iran: గీత దాటితే కఠిన శిక్షే.. ఆందోళనకారులకు అధ్యక్షుడి హెచ్చరిక
హిజాబ్కు వ్యతిరేకంగా మహిళలు చేస్తోన్న ఆందోళనలు, అల్లర్లతో ఇరాన్ అట్టుడుకుతోంది.
టెహ్రాన్: హిజాబ్కు వ్యతిరేకంగా మహిళలు చేస్తోన్న ఆందోళనలు, అల్లర్లతో ఇరాన్ (Iran Protests) అట్టుడుకుతోంది. భద్రతా దళాల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిందేనంటూ ఇరాన్ మహిళలు పిడికిలి బిగిస్తూ నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని ప్రభుత్వం.. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెచ్చరించారు.
‘పౌరుల రక్షణే ఇరాన్ ప్రజల రెడ్ లైన్. చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేందుకు వవరినీ అనుమతించం. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకొన్న శత్రువు.. ప్రజలను ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారికి కఠిన శిక్షలు ఉంటాయి. ఇది ప్రజల నిర్ణయం’ అంటూ ఓ అంతర్జాతీయ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు (Iran President) ఇబ్రహీం రైసీ స్పష్టం చేశారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందన్న ఆయన.. ఇరాన్కు బద్ధశత్రువైన అమెరికానే ఈ అగ్గికి ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించారు. ఇక మాసా అమీని మరణంతో దేశం ఎంతో చింతిస్తోందన్న రైసీ.. ఫోరెన్సిక్తోపాటు న్యాయ నిపుణుల నివేదికలు త్వరలోనే వస్తాయన్నారు.
హిజాబ్ను సరిగా ధరించలేదన్న అభియోగాలపై అరెస్టైన మాసా అమీని అనే యువతి సెప్టెంబర్ 16న పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోవడం ఇరాన్లో ఆందోళనలకు కారణమైంది. దీంతో మరుసటి రోజు నుంచి మొదలైన నిరసనలు గడిచిన 12 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో 76 మంది మృత్యువాతపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొందరు భద్రతా సిబ్బంది ఉండగా.. ఎక్కువ మంది ఆందోళనల్లో పాల్గొన్న మహిళలే ఉండడం ఆందోళన కలిగించే విషయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జబాలియాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జబాలియా శరణార్థి శిబిరంపై ఆదివారం మరోసారి బాంబుల వర్షం కురిపించింది. -
మ్యూనిక్ ఎయిర్పోర్టులో మంచుతుపాను
నిత్యం రద్దీగా ఉండే జర్మనీలోని మ్యూనిక్ విమానాశ్రయం మంచులో కూరుకుపోయింది. భారీ మంచుతుపాను కారణంగా 760 విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
యుద్ధం తర్వాత గాజా భవిష్యత్తేంటి..?
హమాస్తో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత గాజా భవిష్యత్తు ఏమిటి..? అన్న విషయంపై ఇజ్రాయెల్ కసరత్తు చేస్తోంది. -
ఫిలిప్పీన్స్లో మళ్లీ భూకంపం
దక్షిణ ఫిలిప్పీన్స్ను ఆదివారం కూడా భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై 6.6గా తీవ్రతతో భూకంపం నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. -
కాప్-28 ఆరోగ్య డిక్లరేషన్పై సంతకం చేయని భారత్
ఆరోగ్యం, వాతావరణంపై కాప్-28 రూపొందించిన డిక్లరేషన్పై భారత్ సంతకం చేయలేదు. ఆరోగ్యరంగంలో శీతలీకరణకు వినియోగించే గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ డిక్లరేషన్ చెబుతోంది. -
ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధనౌకపై దాడి
ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అతలాకుతలమవుతున్న పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. -
Tanzania: టాంజానియాలో విరిగిపడ్డ కొండచరియలు.. 47 మంది మృతి
టాంజానియాలో గతకొంతకాలంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడి 47 మంది మృతి చెందారు. మరో 85 మంది గాయపడ్డారు. -
Germany: మ్యూనిచ్ ఎయిర్పోర్టులో అల్లకల్లోలం.. మంచులో చిక్కుకుపోయిన విమానాలు..!
నిత్యం రద్దీగా ఉండే జర్మనీలోని మ్యూనిచ్ విమానాశ్రయం మంచులో కూరుకుపోయింది. ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన వందల కొద్దీ విమాన సర్వీసులు ఇప్పటికే రద్దయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
Madhya Pradesh: మామా.. మజాకా!: కమలం గెలుపులో చౌహాన్ కీలక పాత్ర
-
Cyclone Michaung: తుపాను ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు
-
Telangana Elections: చిన్న పార్టీలు.. జయాపజయాలపై పెద్ద ప్రభావం
-
Hyderabad: వారికి మస్త్ మెజారిటీ.. వీరికి బొటాబొటీ
-
Janasena: డిపాజిట్ కోల్పోయిన జనసేన అభ్యర్థులు
-
Telangana Election Results: అప్పుడలా.. ఇప్పుడిలా..!