Iran: హిజాబ్ ధరించని చెస్ క్రీడాకారిణి.. దేశంలోకి వస్తే అరెస్ట్..!
ఇరాన్లో (Iran) హిజాబ్ వ్యతిరేక ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. దీనికి మద్దతు తెలుపుతూ అక్కడి చెస్ (Chess) క్రీడాకారిణి హిజాబ్ ధరించకుండానే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. దీంతో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించినందున ఆమె తిరిగి దేశంలోకి వస్తే అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: హిజాబ్కు (Hijab) వ్యతిరేకంగా ఇరాన్ (Iran) మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పాలకుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న వారికి తీవ్ర శిక్షలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఇరాన్కు చెందిన ప్రముఖ చెస్ (Chess) క్రీడాకారిణి హిజాబ్ ధరించకుండానే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రభుత్వం.. ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ఇరాన్కు చెందిన చెస్ క్రీడాకారిణి సారా ఖాదెం(25).. గతేడాది నవంబరులో కజక్స్థాన్లో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. ఇరాన్ డ్రెస్ కోడ్ ప్రకారం.. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే మహిళలు తప్పకుండా హిజాబ్ ధరించాలి. అదే సమయంలో ఇరాన్లో మహిళలు హిజాబ్ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. వీరికి సంఘీభావంగా సారా ఖాదెం కూడా చెస్ క్రీడల పోటీల సమయంలో హిజాబ్ ధరించలేదు. అయితే, నిబంధనలు అతిక్రమించినందున.. హెచ్చరిక వస్తుందేమోనని సదరు క్రీడాకారిణి భావించారు. కానీ, ఇరాన్కు వస్తే అరెస్టు చేసేలా ఆదేశాలు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
టోర్నమెంట్ తర్వాత ఆమెను స్వదేశానికి రావద్దని హెచ్చరికలు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఖాదెం తల్లిదండ్రులు, బంధువులకు కూడా బెదిరింపులు వచ్చాయట. ఇలా ఇరాన్ ప్రభుత్వ ఆగ్రహానికి గురైన చెస్ క్రీడాకారిణి ప్రస్తుతం దక్షిణ స్పెయిన్లో తలదాచుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. అయితే, భద్రతా కారణాల వల్ల ఆమె ఉంటున్న అడ్రస్ మాత్రం బహిర్గత పరచవద్దని కోరినట్లు సమాచారం. మరోవైపు హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న వందల మందికి అక్కడి ప్రభుత్వం నిర్బంధించడమో.. మరణశిక్ష వేయడం వంటి చర్యలకు దిగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించడం ఆందోళన కలిగించే విషయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు