Pakistan: పాకిస్థాన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. ఖురేషీ విడుదలకు ఆదేశాలు..!
పాకిస్థాన్లో మరోసారి ఉద్రిక్తత రాజుకొంటోంది. ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. మరోవైపు పీటీఐ నేత ఖురేషీ అరెస్టు విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఇంటర్నెట్డెస్క్: ఇమ్రాన్ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అణచివేత విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. శాంతి భద్రతలను సాకుగా చూపుతూ గత వారం పీటీఐ నాయకుడు షా మహమూద్ ఖురేషీని అరెస్టు చేయడం చట్టవ్యతిరేమని ఇస్లామాబాద్ హైకోర్టు పేర్కొంది. ఖురేషీ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్ విచారించి ఈ మేరకు తీర్పును వెలువరించారు. వెంటనే ఖురేషీని విడుదల చేయాలని ఆదేశించారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖురేషీ అరెస్టు జరిగింది.
మరోవైపు ఇమ్రాన్ఖాన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంట్లో 40 మంది వరకు ఉగ్రవాదులున్నారని.. వారిని అప్పగించాలంటూ ప్రభుత్వం 24 గంటల గడువు ఇచ్చింది. తాజాగా ఆ సమయం ముగియడంతో లాహోర్లోని ఆయన ఇంటిని భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. ఆ మార్గం మొత్తాన్ని బారికేడ్లతో మూసివేశారు. మరోవైపు అల-ఖాద్రీ ట్రస్ట్కు భూముల కేటాయింపునకు సంబంధించి నేడు ఇమ్రాన్కు నేషనల్ అకౌంట్బిలిటీ బ్యూరో నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఎన్బీఏకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పలు కేసుల విచారణలు ఉండటంతో ఎన్బీఏ ఎదుట హాజరుకావడం సాధ్యంకాలేదని పేర్కొన్నారు. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని ఖండించారు.
మరోవైపు ఇమ్రాన్ఖాన్ కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి చేపట్టారు. నిరాయుధులైన పీటీఐ కార్యకర్తలపై మే9వ తేదీన కాల్పులు జరిపిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఖాన్ డిమాండ్ చేశారు. ఈ కాల్పుల్లో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో గాయపడ్డారని ఆయన చెప్పారు.
పాక్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అమెరికా కాంగ్రెస్ సభ్యులు
పాకిస్థాన్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ 65 మంది అమెరికా కాంగ్రెస్ ఎంపీలు విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్కు ఓ లేఖను రాశారు. పాక్లో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, కాపాడటానికి కృషి చేయాలని కోరారు. ఇందు కోసం అందుబాటులో ఉన్న మార్గాలన్నీ ఉపయోగించుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్