Team Jorge: 30కిపైగా దేశాల్లో అసత్య ప్రచారాలు.. సంచలనం రేపుతోన్న ఇజ్రాయెల్ బృందం సాఫ్ట్వేర్..?
ప్రపంచ వ్యాప్తంగా ఫేక్ న్యూస్ (Fake News) వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో (Social Media) ప్రచారాన్ని ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ (Israel) బృందం ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించిందని వెలుగులోకి వచ్చింది. భారత్లో ఎన్నికల సమయంలోనూ దీనిని ఉపయోగించినట్లు జర్నలిస్టుల కన్సార్టియం జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అసత్య వార్తల (Fake News) ప్రచారంపై తీవ్ర చర్చ నడుస్తోన్న సమయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్కు చెందిన ఓ బృందం (Israel) ప్రపంచ వ్యాప్తంగా 30కిపైగా దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే విషయం సంచలనం రేపుతోంది. ఎన్నికలను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం కోసం ఈ బృందం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను రూపొందించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీమ్ జార్జ్ (Team Jorge) పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ బృందం.. భారత్లోనూ తప్పుడు ప్రచారం చేసినట్లు ది గార్డియన్ పత్రికకు చెందిన వారితో సహా అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం జరిపిన సీక్రెట్ ఆపరేషన్ వెల్లడించింది.
ప్రత్యేక సాఫ్ట్వేర్..
ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారాన్ని చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు చెందిన ఓ బృందం ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం అడ్వాన్స్డ్ ఇంపాక్ట్ మీడియా సొల్యూషన్స్ (AIMS) పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్యాకేజీని రూపొందించిందట. ఇప్పటికే దాదాపు 30కిపైగా దేశాల్లోని క్లయింట్లకు అందించిందని సమాచారం. వాటిలో 27 దేశాల్లో వారు విజయవంతమైనట్లు సదరు బృందం చెప్పుకుంటోంది.
జర్నలిస్టుల కన్సార్టియం ఆపరేషన్..
తాల్ హానన్ (50) అనే ఇజ్రాయెల్ మాజీ సైనికుడు ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నాడు. జార్జ్ పేరుతో ప్రైవేటుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో ‘టీమ్ జార్జ్’ (Team Jorge)గా పిలుస్తున్నారు. హ్యాకింగ్, దౌర్జన్యం, ఆన్లైన్లో తప్పుడు ప్రచారాలే వీళ్ల ప్రధాన కార్యకలాపాలు. వీటిని నిగ్గుతేల్చేందుకు క్లయింటు పేరుతోనే జర్నలిస్టుల బృందం ఆయన్ను సంప్రదించింది. వారితో ముచ్చటించిన హానన్.. ఆ సాఫ్ట్వేర్ పనితీరును వివరించాడు. కొన్ని టెలిగ్రాం అకౌంట్లను ప్రత్యక్షంగా హ్యాక్ చేసి చూపిండంతోపాటు సోషల్ మీడియాలో ప్రచారాలతో ఎన్నికలను ఎలా ప్రభావితం చేయవచ్చో వివరించి చూపాడు. తర్వాత దీనిపై జర్నలిస్టులు హానన్ను ప్రశ్నించగా.. తాను ఏ తప్పూ చేయడంలేదని, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నట్లు చెప్పాడట.
గౌరీ లంకేష్ స్ఫూర్తితో..
సోషల్ మీడియాలో సాగుతోన్న అసత్య వార్తల ప్రచారంపై అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా 30 మంది మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఈ ఆపరేషన్లో పాలుపంచుకున్నారు. వీరిని ఫ్రాన్స్కు చెందిన ఫర్బిడెన్ స్టోరీస్ అనే స్వచ్ఛంద సంస్థ సమన్వయపరిచింది. జర్నలిస్టులపై బెదిరింపులు, జర్నలిస్టులను జైలుకు పంపడం, హత్యలకు వ్యతిరేకంగా పోరాటమే లక్ష్యంగా పనిచేస్తుంది. అయితే, 2017లో బెంగళూరులో హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేష్.. ఫేక్ న్యూస్కు (Fake News) వ్యతిరేకంగా చేసిన పోరాట స్ఫూర్తితో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది.
గతేడాదిలో నెలలపాటు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆపరేషన్ను జరిపింది. టీమ్ జార్జ్ రూపొందించిన ఈ ఏఐఎంఎస్ సాఫ్ట్వేర్ కార్యకలాపాలను ట్రాక్ చేసింది. ఇందులో వాణిజ్య వివాదాలకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నిర్వహించినట్లు గుర్తించింది. బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్, మెక్సికో, సెనెగల్, యూఏఈతోపాటు భారత్ దేశాల్లోనూ ఈ తరహా ప్రచారానికి పాల్పడినట్లు కనుగొంది. కేంబ్రిడ్జ్ అనలిటికా తరహాలోనే టీమ్ జార్జ్ బృందం పనిచేసిందని ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పని చేశారని, దేశ స్వతంత్రతను విదేశీ చేతుల్లో పెట్టారని ముయిజ్జు ఆరోపించారు. -
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు