Israel: హెజ్బొల్లా డ్రోన్లను కూల్చిన ఇజ్రాయెల్..!
ఇజ్రాయెల్కు చెందిన చమురు రిగ్ దిశగా దూసుకొచ్చిన మూడు హెజ్బొల్లా డ్రోన్లను కూల్చేశారు. ఈ ఘటన మధ్యదరా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చోటు చేసుకొంది.
ఇంటర్నెట్డెస్క్: తమ దేశానికి చెందిన చమురు రిగ్ దిశగా దూసుకొచ్చిన మూడు హెజ్బొల్లా డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. ఈ ఘటన మధ్యధరా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చోటు చేసుకొంది. ఈ డ్రోన్లను తామే లెబనాన్ నుంచి ప్రయోగించినట్లు హెజ్బొల్లా కూడా అంగీకరించింది. దీంతో ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య కరిష్ గ్యాస్ క్షేత్రానికి సంబంధించిన యాజమాన్య హక్కులపై వివాదం కొనసాగుతోంది. దీనిని పరిష్కరించేందుకు అమెరికా దౌత్యవేత్త అమోస్ హాక్స్టన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ గ్యాస్ క్షేత్రం ఐరాస కేటాయించిన విధంగా తమ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి వస్తుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. మరో వైపు లెబనాన్ కూడా ఈ గ్యాస్ క్షేత్రం తమదే అని చెబుతోంది. ఇజ్రాయెల్ ఆ గ్యాస్ క్షేత్రం నిర్వహించకుండా అవసరమైతే బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడమని గతవారం లెబనాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశం చేపట్టిన నిఘా ఆపరేషన్లో భాగంగా ఈ డ్రోన్లను ప్రయోగించింది. తమ ఆపరేషన్ విజయవంతమైందని లెబనాన్ ప్రకటించింది.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్ని గాంట్జ్ మాట్లాడుతూ.. సముద్ర సరిహద్దులపై ఓ ఒప్పందానికి రాకుండా హెజ్బొల్లా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ ఒప్పందం లెబనాన్ శాంతి, సమృద్ధికి చాలా కీలకమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో రాజకీయ అస్థిరత నెలకొన్న సమయంలో హెజ్బొల్లా దాడులు చేయడం గమనార్హం. గురువారం ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దుకు అనుకూలంగా చట్టసభ సభ్యులు ఓటింగ్ చేసిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికకు ఆ దేశం సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్