Turkey: ఇస్తాంబుల్ పేలుడు ఘటన.. కుర్దు స్థావరాలపై భీకర వైమానిక దాడులు!
సిరియా, ఇరాక్లోని కుర్దు మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా తుర్కియే.. వైమానిక, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఇటీవల దేశ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన పేలుడుకు కుర్దు సంస్థలే కారణమని తుర్కియే ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే.
ఇస్తాంబుల్: సిరియా, ఇరాక్లోని కుర్దు మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా తుర్కియే(Turkey) వైమానిక, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఇటీవల దేశ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన పేలుడుకు కుర్దు సంస్థ(Kurdish Groups)లే కారణమని తుర్కియే ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ(PKK), సిరియన్ పీపుల్స్ డిఫెన్స్ యూనిట్స్(YPG)కు చెందిన 89 స్థావరాలపై దాడులు చేసి, ధ్వంసం చేసినట్లు తుర్కియే రక్షణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
వాయువ్య సిరియాలోని టాల్ రిఫాట్ నుంచి ఇరాక్ ఈశాన్య ప్రాంతంలోని ఖాందిల్ పర్వతాల వరకు విస్తరించి ఉన్న ఉగ్ర స్థావరాలపై ఈ దాడులు చేపట్టామని, ఇందులో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారని తుర్కియే తెలిపింది. ‘85 మిలియన్ల తుర్కియే పౌరులతోపాటు దేశ సరిహద్దులను కాపాడుకోవడం మా బాధ్యత. ఈ క్రమంలో ఎవరైనా విద్రోహ చర్యలకు పాల్పడితే ప్రతీకారం తీర్చుకుంటాం’ అని రక్షణశాఖ వెల్లడించింది. అయితే.. ఈ దాడుల్లో పౌరులూ మరణించారని సిరియన్ కుర్దిష్ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. నవంబర్ 13న ఇస్తాంబుల్ నగరంలోని పర్యాటకుల షాపింగ్ కేంద్రమైన ఇస్తిక్లాల్ వద్ద జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడుల వెనుక పీకేకే, వైపీజీల హస్తం ఉందని తుర్కియే ఆరోపించింది. అయితే, ఇందులో తమ పాత్ర లేదని అవి ఖండించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం