Issei Sagawa: యువతిని చంపి తిన్న.. ఆ నరమాంస భక్షకుడు మృతి
నాలుగు దశాబ్దాల క్రితం ప్యారిస్లో ఓ యువతిని చంపి ఆమె శరీర భాగాలను తిన్న ఓ నరమాంస భక్షకుడి తీరు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. జపాన్కు చెందిన ఆ వ్యక్తి.. ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు.
టోక్యో: ఓ యువతిని అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీర భాగాలను తిన్న ఓ యువకుడి తీరు.. 1980ల్లో యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. పారిస్లో జరిగిన ఆ దారుణ ఘటనలో బాధిత యువతి నెదర్లాండ్స్ విద్యార్థి కాగా.. నిందితుడు జపాన్కు చెందిన వ్యక్తి. అయితే, ఆ కేసు నుంచి కొన్ని రోజులకే బయటపడిన అతడు.. ఇన్నేళ్లు స్వేచ్ఛగా తిరిగాడు. నరమాంసమంటే ఎంతో ఇష్టమని చెప్పుకొనే ఆ నరరూప రాక్షసుడు.. ఇటీవల అనారోగ్యం పాలై ఎట్టకేలకు ప్రాణాలు కోల్పోయాడు.
ఇస్సీ సగావా (73).. ఓ కిరాతక హంతకుడిగా జపాన్లో సుపరిచితమే. 1981లో పారిస్లో చదువుకునే సమయంలో రెనీ హార్ట్వెల్ట్ అనే డచ్ యువతిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపుతో నమ్మి వచ్చిన ఆమె.. అతడికే భోజనంగా మారింది. ఇంటికి వచ్చిన యువతిని మెడపై తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమె శరీర భాగాలను కొన్ని రోజుల పాటు ఆరగించాడు. మిగిలిన శరీర భాగాలను స్థానిక పార్కులో పడేసే క్రమంలో పోలీసులకు చిక్కాడు. విచారణలో ఆమెను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. ఆ సమయంలో అతడి తీరును చూసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.
1981లో ఈ సంఘటన జరిగింది. అయితే, ఉన్మాది మనస్తత్వం కలిగిన నిందితుడు (Issei Sagawa) విచారణకు అనర్హుడని భావించిన ఫ్రెంచ్ వైద్య నిపుణులు.. 1993లో అతడిని మానసిక చికిత్స కేంద్రంలో చేర్పించారు. అయితే, బాధితురాలి కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు 1994లో సగావాను బహిష్కరించిన ఫ్రాన్స్ అధికారులు, అతడిని జపాన్కు పంపించివేశారు. కానీ, ‘విపరీత ప్రవర్తన’ వల్లే సగావా ఇలా చేస్తున్నాడని.. అతడికి చికిత్స అవసరం లేదని జపాన్ అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు ఫ్రాన్స్ నుంచి అందకపోవడంతో అది మూతపడిందనే నిర్ధారణకు వచ్చారు. ఇలా కేసు విచారణ అటకెక్కడంతో హంతకుడు బయటకు వచ్చి స్వేచ్ఛగా విహరించాడు.
జైలు శిక్ష నుంచి తప్పించుకున్నప్పటికీ.. తన నేరాన్ని మాత్రం సగావా ఎన్నడూ దాచుకోలేదు. తనపై వచ్చిన అపఖ్యాతినే పెట్టుబడిగా పెట్టుకొని తన సొంత అనుభవాలను వ్యాసాల రూపంలో బహిరంగపరిచేవాడు. తాను చేసిన హత్యకు సంబంధించిన వివరాలనూ అందులో స్పష్టంగా వివరించాడు. తాను చేసిన దారుణంపై ఎన్నడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా.. మహిళలు ఎంతో రుచికరంగా ఉంటారంటూ ఓ ఇంటర్వ్యూలోనే బహిరంగ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతటి క్రూరుడైనప్పటికీ.. జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో ఇంటర్వ్యూలతో సెలబ్రిటీగా మారిపోయాడు. నరమాంస భక్షణపై ఆయనకు ఉన్న ఆసక్తి, గతంలో పారిస్లో చేసిన హత్య గురించిన వివరాలతో 2017లో కనిబా(Caniba) అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది. చివరకు వృద్ధాప్యంలో తన సోదరుడి వద్ద కాలం గడిపిన సగావా.. శ్వాసకోస ఇబ్బందులతో నవంబర్ 24న చనిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
తప్పుడు మార్గంలో బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు యత్నించిన ఓ మహిళ ఏకంగా చనిపోయిన తన బంధువును బ్యాంకుకు తీసుకొచ్చింది. -
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
కెనడా (Canada) ఎయిర్పోర్టులో మాయమైన బంగారం కంటెయినర్ కేసులో ముందడుగు పడింది. ఆ కేసులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
ఆ దేశంలోని ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని (work from home) తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. -
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?