Issei Sagawa: యువతిని చంపి తిన్న.. ఆ నరమాంస భక్షకుడు మృతి
నాలుగు దశాబ్దాల క్రితం ప్యారిస్లో ఓ యువతిని చంపి ఆమె శరీర భాగాలను తిన్న ఓ నరమాంస భక్షకుడి తీరు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. జపాన్కు చెందిన ఆ వ్యక్తి.. ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు.
టోక్యో: ఓ యువతిని అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీర భాగాలను తిన్న ఓ యువకుడి తీరు.. 1980ల్లో యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. పారిస్లో జరిగిన ఆ దారుణ ఘటనలో బాధిత యువతి నెదర్లాండ్స్ విద్యార్థి కాగా.. నిందితుడు జపాన్కు చెందిన వ్యక్తి. అయితే, ఆ కేసు నుంచి కొన్ని రోజులకే బయటపడిన అతడు.. ఇన్నేళ్లు స్వేచ్ఛగా తిరిగాడు. నరమాంసమంటే ఎంతో ఇష్టమని చెప్పుకొనే ఆ నరరూప రాక్షసుడు.. ఇటీవల అనారోగ్యం పాలై ఎట్టకేలకు ప్రాణాలు కోల్పోయాడు.
ఇస్సీ సగావా (73).. ఓ కిరాతక హంతకుడిగా జపాన్లో సుపరిచితమే. 1981లో పారిస్లో చదువుకునే సమయంలో రెనీ హార్ట్వెల్ట్ అనే డచ్ యువతిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపుతో నమ్మి వచ్చిన ఆమె.. అతడికే భోజనంగా మారింది. ఇంటికి వచ్చిన యువతిని మెడపై తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమె శరీర భాగాలను కొన్ని రోజుల పాటు ఆరగించాడు. మిగిలిన శరీర భాగాలను స్థానిక పార్కులో పడేసే క్రమంలో పోలీసులకు చిక్కాడు. విచారణలో ఆమెను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. ఆ సమయంలో అతడి తీరును చూసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.
1981లో ఈ సంఘటన జరిగింది. అయితే, ఉన్మాది మనస్తత్వం కలిగిన నిందితుడు (Issei Sagawa) విచారణకు అనర్హుడని భావించిన ఫ్రెంచ్ వైద్య నిపుణులు.. 1993లో అతడిని మానసిక చికిత్స కేంద్రంలో చేర్పించారు. అయితే, బాధితురాలి కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు 1994లో సగావాను బహిష్కరించిన ఫ్రాన్స్ అధికారులు, అతడిని జపాన్కు పంపించివేశారు. కానీ, ‘విపరీత ప్రవర్తన’ వల్లే సగావా ఇలా చేస్తున్నాడని.. అతడికి చికిత్స అవసరం లేదని జపాన్ అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు ఫ్రాన్స్ నుంచి అందకపోవడంతో అది మూతపడిందనే నిర్ధారణకు వచ్చారు. ఇలా కేసు విచారణ అటకెక్కడంతో హంతకుడు బయటకు వచ్చి స్వేచ్ఛగా విహరించాడు.
జైలు శిక్ష నుంచి తప్పించుకున్నప్పటికీ.. తన నేరాన్ని మాత్రం సగావా ఎన్నడూ దాచుకోలేదు. తనపై వచ్చిన అపఖ్యాతినే పెట్టుబడిగా పెట్టుకొని తన సొంత అనుభవాలను వ్యాసాల రూపంలో బహిరంగపరిచేవాడు. తాను చేసిన హత్యకు సంబంధించిన వివరాలనూ అందులో స్పష్టంగా వివరించాడు. తాను చేసిన దారుణంపై ఎన్నడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా.. మహిళలు ఎంతో రుచికరంగా ఉంటారంటూ ఓ ఇంటర్వ్యూలోనే బహిరంగ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతటి క్రూరుడైనప్పటికీ.. జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో ఇంటర్వ్యూలతో సెలబ్రిటీగా మారిపోయాడు. నరమాంస భక్షణపై ఆయనకు ఉన్న ఆసక్తి, గతంలో పారిస్లో చేసిన హత్య గురించిన వివరాలతో 2017లో కనిబా(Caniba) అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది. చివరకు వృద్ధాప్యంలో తన సోదరుడి వద్ద కాలం గడిపిన సగావా.. శ్వాసకోస ఇబ్బందులతో నవంబర్ 24న చనిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!