Ukraine Crisis: ఉక్రెయిన్ సరిహద్దులకు అమెరికా ప్రథమ మహిళ..!
యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సతీమణ త్వరలో ప్రయాణం కానున్నారు. ఉక్రెయిన్ నుంచి తలదాచుకోవడానికి ఆదేశానికి వచ్చిన తల్లులను మదర్స్డే సందర్భంగా ఆమె కలవనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.
ఇంటర్నెట్డెస్క్: రష్యా దండయాత్రతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సతీమణి త్వరలో రానున్నారు. ఉక్రెయిన్ నుంచి తలదాచుకోవడానికి ఆ దేశానికి వచ్చిన తల్లులను మదర్స్డే సందర్భంగా ఆమె కలవనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.
జిల్ తన పర్యటనలో భాగంగా గురువారం అమెరికా నుంచి రొమానియాలోని మిహైల్ కొగల్నిసియా ఎయిర్ బేస్కు చేరుకొంటారు. ప్రస్తుతం ఈ ఎయిర్ బేస్ నాటో ప్రతిస్పందన దళాలకు స్థావరంగా ఉంది. అక్కడ సర్వీస్ మెంబర్లను ఆమె కలవనున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం సిబ్బంది వెల్లడించారు.గురువారం నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో ఆమె పలువురు దేశనాయకులతో బేటీ కానున్నారు. దీంతోపాటు మదర్స్ డే రోజున ఆమె స్లొవాకియాలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన తల్లులతో భేటీ కానున్నారు. యుద్ధం మొదలైన నాటినుంచి 55లక్షల మంది ఉక్రెయిన్ను వీడి వివిధ ప్రాంతాలకు వలసపోయారు.
ఇప్పటికే జిల్ బైడెన్ ఉక్రెయిన్కు మద్దతుగా సన్ఫ్లవర్ ఉన్న మాస్కును ధరించి సంఘీభావం తెలిపింది. అదే నెలలో ఆమె ఉక్రెయిన్కు సంక్షోభంలో సాయం చేయడానికి పంపిన అమెరికా సైనికుల కుటుంబాలను కలుసుకొన్నారు. సైనికుల తల్లుల మనస్సు తనకు తెలుసని ఆమె అనునయించారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా త్వరలోనే కీవ్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ ఆడమ్ స్కిఫ్ ఇటీవల వెల్లడించారు. జోబైడెన్ పర్యటన విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. ఎంత తొందరగా ఈ పర్యటన సాధ్యమవుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అమెరికా రక్షణ,విదేశాంగ మంత్రులతోపాటు ప్రతినిధుల సభ స్పీకర్, కీలక కమిటీల అధ్యక్షులు కీవ్లో పర్యటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్