Joe Biden: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో జోబైడెన్: జిల్
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో జోబైడెన్ నిలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన సతీమణి జిల్ బయటపెట్టారు.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా(USA) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి 2024 ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారని అమెరికన్లు తెలుసుకోవాలని ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్(Jill Biden) వెల్లడించారు. తాను కూడా దానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నమీబియా, కెన్యా పర్యటనలు ముగించుకొన్న తర్వాత ఆమె ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ వయోభారం కారణాలతో 2024 ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగుతారనే ప్రచారాన్ని జిల్ కొట్టి పారేశారు. బైడెన్ త్వరలోనే తన ప్రచార కార్యక్రమాల వివరాలు వెల్లడిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా దానికి మద్దతుగా నిలుస్తానని వెల్లడించారు.
వాస్తవానికి ఆమె తన పర్యటన సమయంలో అసోసియేటెడ్ ప్రెస్ వద్ద ఈ అంశంపై మరింత గట్టిగా మాట్లాడారు. బైడెన్ పోటీ అంశంపై ప్రశ్నించగా.. ‘‘అధ్యక్షుడు ఇప్పటికే చాలా సార్లు ఈ అంశాన్ని వెల్లడించారు. ఇక నమ్మడం అనేది మీ ఇష్టం’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల మధ్యలోనే జోబైడెన్ 2024లో మళ్లీ బరిలో నిలవడంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచిన ఆయనకు ఓటర్లు మరో సారి అవకాశం ఇస్తారా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
జోబైడెన్ స్వయంగా చాలా సార్లు తిరిగి ఎన్నికల బరిలో నిలవాలన్న కోరికను వ్యక్తం చేశారు. తన వయసుపై వచ్చిన ప్రశ్నలను ఆయన తోసిపుచ్చారు. కాకపోతే జోబైడెన్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 2023 ఆరంభంలో తన అభ్యర్థిత్వంపై నిర్ణయం ప్రకటిస్తానని గత నవంబర్లో వెల్లడించారు. ఇప్పటి వరకు ఆయన్ను పెద్దగా సవాల్ చేసే వ్యక్తి డెమొక్రాట్లలో ఎవరూ తెరపైకి రాలేదు. దీంతో తాపీగా అభ్యర్థిత్వం ప్రకటిద్దామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో ‘రహస్య పత్రాల’ వివాదంలో ఆయన చిక్కుకున్నారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారలతో బిజీగా గడిపారు. మార్చి లేదా ఏప్రిల్లో ఆయన ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. జోబైడెన్ బరిలోకి నిలిచే విషయంలో నిర్ణయాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో జిల్ కూడా ఒకరు.
ఇప్పటి వరకు బైడెన్ తన ప్రచార మేనేజర్లను కానీ, ప్రచార ప్రధాన కార్యాలయాన్ని కానీ ఏర్పాటు చేయలేదు. ఎన్నికల్లో బైడెన్ వయసు అంశం ప్రధానం కానుంది. రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి చేసేనాటికి దాదాపు 86 ఏళ్లకు చేరుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు