US: ప్రతిరోజు లక్షల్లో కేసులు.. కరోనా కట్టడికి అమెరికా కీలక నిర్ణయం
యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే కొవిడ్-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్ కిట్లతో పాటు వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్95 మాస్క్లను......
వాషింగ్టన్: ఒమిక్రాన్ విజృంభణతో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. పలు కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే కొవిడ్-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్ కిట్లతో పాటు వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్95 మాస్క్లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు వచ్చే వారం నుంచి 1,000 మంది సైనిక వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామని తెలిపారు. వైద్య సౌకర్యాలను పెంచటం, సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్వేతసౌంధంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు.
‘కరోనా కేసులు గరిష్ఠంగా నమోదవుతున్న క్రమంలో మనమంతా నిరుత్సాహంతోనే నూతన ఏడాదిలోకి ప్రవేశించామని తెలుసు. ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారికే ఎక్కువ ప్రమాదం. టీకా తీసుకున్నవారు వైరస్ బారినపడినా తీవ్ర అనారోగ్యానికి గురికావటం, మరణించటం వంటివి నమోదు కావటం లేదని గణాంకాలు చెబుతున్నాయి’ అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలోనే.. చాలా మంది వైద్య సిబ్బంది వైరస్ బారినపడి హోమ్ క్వారంటైన్కు వెళ్తున్నారు. దీంతో పెద్ద పెద్ద ఆసుపత్రులు సైతం సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. సిబ్బంది లేక.. వైరస్కు గురైన వైద్య సిబ్బంది సైతం పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ కొరతను తగ్గించేందుకు ఫెడరల్ మెడికల్ సిబ్బందిని ప్రభుత్వం పలు రాష్ట్రాలకు పంపించింది. వీటికి అదనంగా మిలిటరీ వైద్యులను అవసరమైన ప్రాంతాల్లోకి పంపనున్నారు.
అమెరికాలో క్రితం రోజుతో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా భారీగానే కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 8,06,493 మందికి పాజిటివ్గా తేలింది. 1,969 మంది వైరస్తో మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,69,212కు చేంది. కేసుల సంఖ్య 6,23,64,475కి పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్