Iran: ఆ ఖాళీ కుర్చీ వెనుక ఓ ఆసక్తికర ఘటన..!
ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా యంకర్ ఎదుట ఖాళీ కుర్చి ఉన్న ఆ ఫొటో వెనుక ఆసక్తికర ఘటన ఉంది. ఆ మహిళ పేరు క్రిస్టియన్ అమన్పూర్. బ్రిటన్లో ఓ ఇరాన్కు చెందిన వ్యక్తికి జన్మించింది.
ఇంటర్నెట్డెస్క్: ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్న యాంకర్ ఎదుట ఖాళీ కుర్చీ ఉన్న ఆ ఫొటో వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఆ ఫొటోలోని మహిళ పేరు క్రిస్టియన్ అమన్పూర్. ఇరానీ-బ్రిటన్ కుటుంబంలో జన్మించింది. 11ఏళ్లు వచ్చే వరకు ఇరాన్లోనే పెరిగింది. ఆమె ప్రస్తుతం సీఎన్ఎన్లో చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్. అమెరికా ప్రభుత్వ నిర్వహణలోని పీబీఎస్లో కూడా ఓ షో చేస్తోంది. ఆమె తన ట్విటర్లో ఆ ఫొటోను పోస్టు చేసి.. దాని వెనుక కథను మొత్తం వివరించింది. అదేంటంటే..
న్యూయార్క్లోని ఐరాస కార్యాలయంలో యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిల్లో ప్రసంగించేందుకు ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ న్యూయార్క్కు వచ్చారు. ఈ క్రమంలో రైసీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి అమన్పూర్ కొన్ని వారాల ముందే ప్లాన్ చేశారు. ఇందుకోసం ఆమె బృందం దాదాపు 8 గంటలు కష్టపడి సెట్, ట్రాన్స్లేషన్ యంత్రాలు, లైట్లు, కెమెరాలను సిద్ధం చేసింది. మరో 40 నిమిషాల్లో ఇరాన్ అధ్యక్షుడు వస్తారనగా.. ఇంతలో ఆయన సహాయకుడు రంగంలోకి దిగాడు. అమన్పూర్ను ‘హెడ్స్కార్ఫ్’ ధరించాల్సిందిగా అధ్యక్షుడు కోరుతున్నారని తెలిపాడు. దీనిని ఆమె చాలా గౌరవంగా తిరస్కరించింది. తాము న్యూయార్క్లో ఉన్నామని, ఇక్కడ హెడ్స్కార్ఫ్కు సంబంధించి ఎటువంటి చట్టాలు, ఆచారాలు లేవని అతడికి వివరించింది. గతంలో ఇరాన్ అధ్యక్షులను వారి దేశం బయట ఇంటర్వ్యూలు చేసిన సమయంలో కూడా ఎటువంటి హెడ్స్కార్ఫ్ ధరించాల్సిన అవసరం రాలేదని అమన్పూర్ తెలిపింది. కానీ, ఆ సహాయకుడు అవేవీ పట్టించుకోలేదు. అమన్పూర్ హెడ్స్కార్ఫ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ జరుగుతుందని తేల్చిచెప్పాడు. ఇది గౌరవానికి సంబంధించిన అంశమని.. ఇప్పుడు ఇరాన్లో పరిస్థితికి కూడా ఇదే కారణమని అతడు పేర్కొన్నాడు. కానీ, అమన్పూర్ మాత్రం అంగీకరించకుండా అక్కడి నుంచి వచ్చేశారు. దీంతో ఇంటర్వ్యూ రద్దైంది. ‘‘ఓ పక్క ఇరాన్లో జరుగుతోన్న తీవ్ర ఆందోళనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడటానికి ఇది చాలా కీలక సమయం’’ అంటూ అమన్పూర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఫొటోతోపాటు జరిగిన ఘటనను వివరిస్తూ ట్వీట్ చేశారు.
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ ఘర్షణల కారణంగా గత ఆరు రోజుల్లో దేశవ్యాప్తంగా 31 మంది దుర్మరణం పాలయ్యారు. హిజాబ్ను సరిగా ధరించలేదన్న అభియోగంపై ఇరాన్లో మాసా అమీని అనే యువతిని ఇటీవల నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ ఆమె.. చికిత్స పొందుతూ గతవారం మరణించింది. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్లో గతవారాంతంలో మొదలైన నిరసనలు.. క్రమంగా దేశమంతటికీ పాకాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు