Karachi suicide bomber: ఆ సూసైడ్ బాంబర్.. పసిబిడ్డల తల్లి, ఎంఫిల్ పట్టా దారు..!
పాకిస్థాన్లో మరోసారి చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకొని మంగళవారం దాడి జరిగింది. ఈ ఘటనలో బుర్ఘా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది.
కరాచీ: పాకిస్థాన్లో మరోసారి చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకొని మంగళవారం దాడి జరిగింది. ఈ ఘటనలో బుర్ఖా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. బలూచిస్థాన్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ.. ఆ మహిళ ఈ దాడికి పాల్పడింది. ఈ సమయంలో మృతురాలి గురించిన విషయాలు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎంఫిల్ చదివిన ఆమెకు.. ఇద్దరు పసిబిడ్డలున్నారు. ఆమె విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినట్లు వార్త సంస్థలు వెల్లడించాయి.
మంగళవారం కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన మృతురాలి పేరు షారీ బలోచ్(30). ఆమె జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఎంఫిల్ పట్టా పొందింది. టీచర్గా పనిచేస్తోంది. ఆమె భర్త డెంటిస్ట్. తండ్రి ఒక లెక్చరర్. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరికి ఎనిమిదేళ్లు. ఇంకొరికి ఐదేళ్లు. ఆ కుటుంబానికి ఉగ్రవాద చరిత్ర లేదు. ఇలాంటి ఈమె రెండేళ్ల క్రితం బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్లోని ఆత్మాహుతి దళంలో చేరింది. తన చిన్న పిల్లల కారణంగా ఈ దళం నుంచి బయటకు వెళ్లే అవకాశం వచ్చినప్పటికీ.. ఆమె ముందుకెళ్లేందుకే నిర్ణయించుకుంది.
‘ప్రస్తుత మిషన్ను షారీ బలోచ్ విజయంతంగా నిర్వహించింది. చైనా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విస్తరణకు చిహ్నం అయిన కన్ఫూసియస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, సిబ్బందిని లక్ష్యం చేసుకోవడానికి కారణం.. బలూచిస్థాన్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ఉనికిని సహించబోమని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకే. బలూచ్ వనరులను కొల్లగొట్టడం, బలూచ్ ప్రజలపై మారణహోమం నిర్వహిస్తోన్న పాకిస్థాన్ ఆర్మీకి సహకరించడం మానుకోవాలని చైనాను చాలాసార్లు హెచ్చరించాం. కానీ చైనా మా మాట పెడచెవినపెడుతోంది. ఇప్పటికైనా తన దోపిడీ ప్రాజెక్టులను ఆపకపోతే.. భవిష్యత్తులో జరిగే దాడులు ఇంకా తీవ్రంగా ఉండనున్నాయి’ అని బీఎల్ఏ హెచ్చరించింది.
ఈ దాడి అనంతరం షారీ భర్తగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి ట్విటర్లో స్పందించారు. ‘షారీ.. నువ్వు మా జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతావు’ అంటూ ఆమె, పిల్లలతో ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారో తెలియదు. దీనిపై బాషిర్ అహ్మద్ అనే జర్నలిస్టు స్పందిస్తూ.. ‘ఆ కుటుంబానికి పాకిస్థాన్ సైన్యం నుంచి ఎలాంటి హాని జరగలేదు. కానీ ఆమె ఎంచుకున్న మార్గం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆమె నిర్ణయానికి కారణాలు ఏమైనా.. బలూచ్ సాయుధపోరాటంలో రక్తపాతంతో కూడిన అధ్యాయం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది’ అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. బలూచిస్థాన్, దాని పరిసర ప్రాంతాలు చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్కు చాలా కీలకం. కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో చైనీయులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ ప్రావిన్స్, కరాచీల్లో వేర్పాటు వాదులు దాడులకు పాల్పడ్డారు. తాజా ఘటనలో ముగ్గురు చైనా దేశీయులు మృతి చెందగా.. పాక్కు చెందిన వ్యాను డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దీనిని చైనా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రవాద సమస్యకు మూల కారణాన్ని తెలుసుకుని.. పరిష్కరించడానికి ప్రయత్నాలను ప్రారంభించాలని పాక్ను డిమాండ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా