Khalistan Supporters: కెనడాలో ఖలిస్థాన్ సానుభూతిపరుల దుశ్చర్య..
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్ దీప్ నిజ్జర్ హత్యకు నిరసనగా కెనడాలో భారత దౌత్య కార్యాలయాల ముందు చేపట్టిన నిరసనల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు.
టొరంటో: భారత్కు వ్యతిరేకంగా కెనడా (Canada)లో ఖలిస్థాన్ మద్దతుదారులు (Khalisthan Supporters) పేట్రేగిపోతున్నారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నిరసనగా కెనడాలోని భారత్ దౌత్య కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. భారత జాతీయ జెండాను అవమానించారు. ప్రదాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టొరంటోలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సుమారు 100 మంది ఖలిస్థాన్ మద్దతుదారులు పాల్గొన్నారు. మరోవైపు వాంకోవర్, ఒట్టవాలో కూడా నిరసనలు కొనసాగాయి.
భారత్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. విచారణకు సహకరించాలని కోరిన విదేశాంగ శాఖ
కొద్ది రోజుల క్రితం ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అతని హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ప్రకటన చేశారు. అయితే, ట్రూడో ఆరోపణల్లో వాస్తవం లేదని భారత్ వ్యాఖ్యానించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ శాఖలు తమ పౌరులకు కీలక సూచనలు చేశాయి. కెనడాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కెనడా సైతం అత్యవసరమైతే తప్ప భారత్లో పర్యటించవద్దని తమ దేశ పౌరులకు సలహాను జారీ చేసింది.
ఆధారాలు లేకుండా ట్రూడో ఆరోపణలా..? భారత్కు మద్దతుగా శ్రీలంక మంత్రి
ఈ వివాదంపై కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ స్పందిస్తూ.. భారత్తో బంధం తమకు ‘ముఖ్యమైనదే’ అని పేర్కొన్న ఆయన.. నిజ్జర్ హత్యకు సంబంధించి తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి అని.. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం.. పౌరుల ప్రాణాలు కూడా తమకు చాలా విలువైనవని పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో తమ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, దీనికి భారత్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ మాత్రం కెనడా ప్రధాని చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. -
అయిదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి.. ప్రాణాలు హరీ
చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్ స్ట్రీమింగులో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్ పింగ్డింగ్షాన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ కళాశాలలో లీ హావో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. -
అప్పటి వరకూ ఈ ట్యాగ్ ధరిస్తా: మస్క్
సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్కు వచ్చారు. -
శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు. -
అమెరికాలో పొగమంచు.. ఢీకొట్టుకున్న 30 వాహనాలు
అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్స్టేట్ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
రష్యా సరిహద్దులు పూర్తిగా మూసివేత: ఫిన్లాండ్
రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. -
అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు లేదు!
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. -
మరో 11 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్ 11 మందిని, ఇజ్రాయెల్ 33 మందిని విడుదల చేశాయి. -
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
అమెరికాలోని పలు ఆస్పత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది.


తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
-
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య