Kidnap: చివరకు తోటలో శవాలై తేలారు.. భారత సంతతి కుటుంబం కిడ్నాప్ విషాదాంతం
కాలిఫోర్నియాలో సోమవారం అపహరణకు గురైన నలుగురు భారత సంతతి వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ఎనిమిది నెలల పాప కూడా ఉంది.
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో కిడ్నాప్నకు గురైన భారత సంతతి కుటుంబం ఘటన చివరకు విషాదాంతమైంది. అపహరణకు గురైన ఎనిమిది నెలల పాప, ఆమె తల్లిదండ్రులు, సమీప బంధువు.. విగతజీవులై కనిపించినట్లు అక్కడి పోలీసు అధికారులు బుధవారం వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఓ అనుమానితుణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని మెర్సిడెస్ కౌంటీలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన జస్దీప్ సింగ్ కుటుంబం ట్రక్కుల రవాణ వ్యాపారం చేస్తోంది. సోమవారం ఉదయం జస్దీప్ సింగ్ (36), ఆయన భార్య జస్లీన్ కౌర్ (27), తమ ఎనిమిది నెలల పాపతో కలిసి యథావిధిగా వ్యాపార కార్యాలయానికి వెళ్లారు. వీరితోపాటు చిన్నారి మామ అమన్దీప్ సింగ్ (39)కూడా కాసేపటికి అక్కడికి చేరుకున్నారు. కాసేపటికే అక్కడికి వచ్చిన ఓ గుర్తు తెలియని దుండగుడు వారిని తుపాకితో బెదిరించి ఓ ట్రక్కులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్నకు గురైన వారిలో ఒకరి కారు అదేరోజు సాయంత్రం వ్యాపార కార్యాలయ సమీపంలో దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా యజమాని ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. కుటుంబ సభ్యులు తమకేమీ తెలియదని చెప్పారు. వారి ఆఫీసుకి వెళ్లి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో కిడ్నాప్ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ అయిన వారిలో ఒకరి బ్యాంకు కార్డును మంగళవారం ఉదయం దుండగుడు స్థానిక ఏటీఎంలో ఉపయోగించినట్లు గుర్తించారు. అక్కడి సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ అనుమానితుడి ఫొటోను మెర్సిడెస్ కౌంటీ పోలీసులు విడుదల చేశారు. అప్పటి నుంచి తీవ్రంగా గాలింపు చేపట్టి.. అదే రోజు అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సమయంలోనే అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం గమనార్హం. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఇంతలోనే పోలీసులు కిడ్నాప్ అయిన నలుగురి శవాల్ని బుధవారం సాయంత్రం ఓ తోటలో గుర్తించారు. అయితే, తమ అదుపులో ఉన్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్