Kim Jong Un: కిమ్ భార్య.. థియేటర్లో ప్రత్యక్షం..!
కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తరకొరియాకు అధినేత అయినప్పటికీ బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించడం మాత్రం చాలా అరుదే.
ఐదు నెలల తర్వాత అజ్ఞాతం వీడిన రి సోల్ జు
ఇంటర్నెట్ డెస్క్: కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తరకొరియాకు అధినేత అయినప్పటికీ బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించడం మాత్రం చాలా అరుదే. ఆయనే కాదు కీలక బాధ్యతలు చూసుకునే ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతే. ఇటీవల కిమ్ భార్య రి సోల్ జు గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోయారు. తాజాగా ఆమె ఓ థియేటర్లో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. దాదాపు ఐదు నెలల తర్వాత కిమ్ దంపతులు బహిరంగంగా కనిపించడంతో అక్కడి ప్రేక్షకులందరూ కేరింతలు, చప్పట్లతో ఆనందం వ్యక్తం చేసినట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది.
ఉత్తర కొరియా ప్రస్తుతం కొత్త సంవత్సర వేడుకలు (Lunar New Year) జరుపుకుంటోంది. ఇందులో భాగంగా కిమ్ జోంగ్ ఉన్-రి సోల్ జు దంపతులు ఓ కళా ప్రదర్శనలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ వేదికపైకి వెళ్లి ప్రదర్శనకారులతో కలిసి ఫొటో దిగారు. ఆ సమయంలో ఆడిటోరియంలో ప్రేక్షకులు చప్పట్లతో కేరింతలు కొట్టినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, గతేడాది సెప్టెంబర్ 9న చివరిసారిగా ఆమె ఓ అధికారిక కార్యక్రమంలో కిమ్తో కలిసి కనిపించిన తర్వాత మరే కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. దీంతో ఆమె ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత మళ్లీ ఆమె ప్రత్యక్షం కావడంతో అక్కడివారందరూ ఆశ్చర్యంగా చూసినట్లు సమాచారం.
ఇదిలాఉంటే, అంతకుముందు కూడా కిమ్ భార్య రి సోల్ జు దాదాపు ఓ ఏడాదిపాటు అజ్ఞాతంలో ఉండిపోయారు. దాంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మరో బిడ్డకు జన్మనివ్వనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాస్తవానికి కొవిడ్ కారణంగా ఆమె బాహ్య ప్రపంచం ఎదుటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నివేదికలు ఇచ్చాయి. వారి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారని పేర్కొన్నాయి. అనంతరం తన మామ దివంగత కిమ్జోంగ్ ఇల్ జయంతి వేడుకల్లో భర్త కిమ్తో కలిసి కనిపించారు. తాజాగా మరోసారి సుదీర్ఘ కాలం తర్వాత బహిరంగ కార్యక్రమంలో పాల్గొని వార్తల్లో నిలిచారు. ఇక కిమ్కు ఎంతమంది పిల్లలు ఉన్నారనే విషయంపై బహిరంగ సమాచారం లేనప్పటికీ ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెబుతుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.