Kim: అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. సైన్యానికి కిమ్ ఆదేశాలు
యుద్ధం మాట చెప్పి కిమ్(Kim) మరోసారి వార్తల్లోకి వచ్చారు. తీవ్రస్థాయిలో డ్రిల్స్ నిర్వహించాలని, ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని సైనికులకు సూచించారు.
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) నుంచి వచ్చే ప్రతిమాటా వార్త అవుతుంది. అలాగే ఆయన మాటలు, చేతలపై దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాలు ఓ కన్నేసి ఉంచుతాయి. ఇక ఇటీవల కిమ్ రాజ్యంలో యుద్ధం పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తాజాగా ఆయన తన సైన్యాన్ని ఆదేశించారు. తన కుమార్తెతో కలిసి సైనిక పరమైన డ్రిల్స్ పర్యవేక్షించిన సమయంలో ఈ వ్యాఖ్య చేశారు. అలాగే హాసాంగ్ యూనిట్ నుంచి ఒకేసారి ఆరు క్షిపణులను ప్రయోగించినట్లు ఉ.కొరియా మీడియా సంస్థ విడుదల చేసిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. వారిద్దరూ కలిసి క్షిపణి ప్రయోగాలను వీక్షించారు.
సైనిక డ్రిల్స్ను పర్యవేక్షిస్తోన్న సమయంలో కిమ్(Kim Jong Un) మాట్లాడుతూ.. ‘యద్ధానికి సిద్ధంగా ఉండాలి. అసలైన యుద్ధం కోసం వివిధ పద్ధతుల్లో డ్రిల్స్ను తీవ్రతరం చేయాలి’ అని వెల్లడించారు.
ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద సైనిక విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా, దక్షిణ కొరియా సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి ఇవి జరగనున్నాయి. ఈ క్రమంలో కిమ్ నోటి నుంచి యుద్ధం మాట వచ్చింది. ఉత్తర, దక్షిణ కొరియా మధ్య సంబంధాలు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయి. దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ, దక్షిణ కొరియాకు దీటుగా నిలిచేందుకు కిమ్ పోటీపడుతున్నారు. అగ్రరాజ్యం హెచ్చరికలు ఖాతరు చేయకుండా క్షిపణులు ప్రయోగిస్తున్నారు. మరోవైపు ద.కొరియా సైనిక పరంగా అమెరికాపై ఆధారపడుతోంది. ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.
ఉత్తరకొరియా(North Korea) నియంత సోదరి కిమ్ యో జోంగ్ ఇటీవల అమెరికా(USA)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే సహించేది లేదని తేల్చిచెప్పింది. దానిని తమపై యుద్ధంగా భావిస్తామని పేర్కొంది. ప్యాంగ్యాంగ్ వ్యూహాత్మక పరీక్షలకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం చేపట్టే చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సునీతా విలియమ్స్(Sunita Williams)..ఇప్పుడు మరోమారు సిద్ధమవుతున్నారు. -
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్