Kim Sister: దక్షిణ కొరియాపై ‘కిమ్’ సోదరి అవమానకర వ్యాఖ్యలు
అమెరికా, దక్షిణ కొరియాలు తోడు దొంగలుగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ సోదరి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు, అక్కడ ప్రభుత్వంలోని వారిని మూర్ఖులుగా అభివర్ణించడంతోపాటు పరుష పదజాలంతో దూషించారు.
సియోల్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ రాజ్యంలో ఆయన సోదరి కిమ్ యో జొంగ్ శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న ఆమె.. కిమ్ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా దక్షిణ కొరియాను తీవ్ర పదాలతో దూషించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడితోపాటు అక్కడి ప్రభుత్వాన్ని ‘మూర్ఖులు’గా అభివర్ణించిన ఆమె.. అమెరికా చెప్పినట్లు ఆడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో కిమ్ సోదరి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
‘అమెరికా చెప్పినట్లు నడుచుకునే దక్షిణ కొరియా.. మాపై నిర్మొహమాటంగా ఆంక్షలు విధిస్తూనే ఉంది. ద.కొరియా కన్జర్వేటివ్ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్, ఆయన ప్రభుత్వంలోని వారంతా మూర్ఖులే. మాకు ప్రమాదకర పరిస్థితులను కల్పిస్తూనే ఉన్నారు’ అని కిమ్ సోదరి చెప్పినట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. ఇక మూన్ జే-ఇన్ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణ కొరియా తమ లక్ష్యం కాదన్న ఆమె.. అమెరికా, దక్షిణ కొరియాలు తోడుదొంగలుగా వ్యవహరిస్తూ తమపై ఆంక్షలు కొనసాగిస్తున్నారని విమర్శించారు.
కిమ్ సోదరి వ్యాఖ్యలపై దక్షిణ కొరియా కూడా తీవ్రంగా స్పందించింది. తమ అధినేత, ప్రభుత్వంపై అవమానకరంగా మాట్లాడటం శోచనీయమని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు తమ ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురిచేయడంతోపాటు ఇక్కడి ప్రభుత్వ వ్యతిరేకులను ప్రేరేపించే ప్రయత్నంలో భాగమేనని మండిపడింది. దేశంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఉత్తర కొరియాకు చెందిన 15 మంది వ్యక్తులతో పాటు 16 సంస్థలపై దక్షిణ కొరియా ఇటీవల ఆంక్షలు విధించింది.
అమెరికా, దక్షిణ కొరియాలపై ఉత్తర కొరియా పరుషపదజాలం వాడటం ఇదేం కొత్త కాదు. ఇటీవల ఉత్తర కొరియా జరిపిన క్షిపణి ప్రయోగాలను ఖండించాలంటూ ఐరాసపై అమెరికా ఒత్తిడి చేయడంపై తీవ్రంగా మండిపడింది. కుక్కతో పోలుస్తూ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు లీ మ్యూంగ్-బా, మాజీ అధ్యక్షురాలు పార్క్ గెయున్-హైలను కూడా గతంలో అసభ్య పదజాలంతో దూషించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు