King Charles Coronation: ఘనంగా కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం.. కిరీటాన్ని ధరించిన బ్రిటన్ రాజు
బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 (King Charles) పట్టాభిషేకం (Coronation) ఘనంగా జరిగింది. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో సందడిగా జరిగిన కార్యక్రమంలో ఛార్లెస్ 3 కిరీటాన్ని ధరించి సింహాసనాన్ని అధిష్ఠించారు.
లండన్: బ్రిటిష్ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్.. సంప్రదాయాలను అనుసరించి కిరీటాన్ని ధరించారు. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో శనివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో కింగ్ ఛార్లెస్-3 సింహాసనాన్ని అధిష్ఠించగా.. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలంకరించారు.
ప్రదక్షిణ.. ప్రమాణాలు
పట్టాభిషేకం నిమిత్తం కింగ్ ఛార్లెస్ దంపతులు సంప్రదాయంగా వస్తున్న బంగారు పూతతో చేసిన ప్రత్యేక బగ్గీలో కాకుండా.. ఆధునీకరించిన డైమండ్ జూబ్లీ స్టేట్ కోచ్ బగ్గీలో బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి వెస్ట్మినిస్టర్ అబేకు చేరుకున్నారు. అబేకు వచ్చిన తర్వాత కాంటెర్బరీ ఆర్చ్బిషప్ తొలుత కింగ్ ఛార్లెస్ను పరిచయం చేశారు. అన్నివైపులా కన్పించేలా నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరుగుతుంటే ఈ పరిచయం జరిగింది. అనంతరం చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేశారు. తర్వాత చర్చి ఆఫ్ ఇంగ్లాండ్కు నమ్మకస్థుడైన క్రిస్టియన్గా ఉంటానని ఛార్లెస్ రెండో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక సభికులు ‘భగవంతుడు రాజును రక్షించుగాక’ (గాడ్ సేవ్ కింగ్) అంటూ ఆలపించారు.
రిషి సునాక్ బైబిల్ పఠనం..
ప్రమాణం ముగియగానే సభలో ప్రార్థనలు చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బైబిల్లోని కొన్ని పంక్తులను పఠించారు. ఈసారి పట్టాభిషేక వేడుకలో భిన్న మత విశ్వాసాలకు పెద్దపీట వేస్తున్నట్లు కాంటెర్బరీ ఆర్చ్బిషప్ కార్యాలయం అంతకుముందు తెలిపింది.
సింహాసనంపై ఆసీనులై..
ప్రమాణం, ప్రార్థనల తర్వాత 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనాన్ని కింగ్ ఛార్లెస్-3 అధిష్ఠించారు. ఈ సింహాసనం కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచారు. అనంతరం కింగ్ ఛార్లెస్ను జెరూసలెం నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోశారు. ఇదంతా తెరచాటున జరిగింది.
కిరీటాన్ని ధరించి..
నూనెతో అభిషేకం పూర్తయిన తర్వాత ఛార్లెస్ బంగారుతాపడంతో చేసిన మహారాజ గౌన్ ధరించి సింహాసనంపై కూర్చున్నారు. ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్బిషప్ ఆయనకు అందించారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగిన అనంతరం కిరీటధారణ చేశారు. ఆ తర్వాత సభికులంతా ‘గాడ్ సేవ్ కింగ్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజు ఛార్లెస్ పట్టాభిషేక కుర్చీలోంచి లేచి.. రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనులయ్యారు. సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చ్బిషప్తో పాటు యువరాజు ప్రిన్స్ విలియం మోకాళ్లపై వంగి కూర్చొని రాజు కాళ్లకు చేతిని ఆనించి ఆయన కుడి చేతిని ముద్దాడారు. అనంతరం రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేశారు.
నవ్వుతూ కన్పించిన హ్యారీ..
రాచరికాన్ని వదులుకుని రాజకుటుంబానికి దూరమైన ఛార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ కూడా పట్టాభిషేకానికి హాజరయ్యారు. ఈ వేడుకలో తన కజిన్స్తో కలిసి నడిచిన హ్యారీ నవ్వుతూ కన్పించారు. అయితే ఈ కార్యక్రమానికి హ్యారీ ఒంటరిగానే వచ్చారు. భార్య మేఘన్ మార్కెల్, ఆయన ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. హ్యారీ కుమారుడు ఆర్కీ ఈ రోజు నాలుగో పుట్టినరోజు జరుపుకొంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్