King Charles III: రాజు పట్టాభిషేకం.. ఏర్పాట్ల కోసం రూ.1020కోట్లు..!
మే 6న జరగనున్న బ్రిటన్ రాజు ఛార్లెస్-3 (King Charles III) పట్టాభిషేక కార్యక్రమానికి సుమారు 100 మిలియన్ పౌండ్లు (రూ.1020 కోట్లు) ఖర్చుపెడుతున్నట్లు అంచనా.
లండన్: బ్రిటన్ రాజు ఛార్లెస్-3 (King Charles III) పట్టాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం (Coronation) ప్రపంచదేశాల అధినేతల మొదలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం వెళ్లింది. మే 6న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్ పౌండ్లు (రూ.1020 కోట్లు) ఖర్చుపెడుతున్నట్లు అంచనా. ఈ అధికారిక కార్యక్రమానికి అయ్యే ఖర్చును బ్రిటన్ (Britain) ప్రభుత్వమే చెల్లించనుంది. సాధారణంగా రాజకుటుంబీకుల వివాహాలను సొంత ఖర్చుతో చేసుకున్నప్పటికీ.. పట్టాభిషేకాన్ని మాత్రం ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్నారు.
బ్రిటన్ రాణిగా ఎలిజబెత్ II 1953లో పట్టాభిషిక్తురాలయ్యారు. ఆ కార్యక్రమానికి అప్పట్లోనే 1.5 మిలియన్ పౌండ్లు ఖర్చుపెట్టారట. ప్రస్తుత కరెన్సీ విలువతో పోలిస్తే అది సుమారు 50 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.528.7 కోట్లు)తో సమానం. తాజా కార్యక్రమం.. క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేక కార్యక్రమానికి అయిన ఖర్చుకు రెట్టింపు అన్నమాట. అయితే, ఈ కార్యక్రమ టీవీ ప్రసార హక్కుల నుంచి వచ్చే ఆదాయం భారీగానే ఉండనున్నట్లు సమాచారం. కార్యక్రమానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా వస్తుందని.. అంతేకాకుండా ఇది పర్యాటకానికి ఎంతో ఊతమిస్తుందని బ్రిటన్ మీడియా పేర్కొంది. రాజు పట్టాభిషేక కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు హాజరుకానుండటంతో వారికి భద్రత కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ‘ఆపరేషన్ గోల్డెన్ ఆర్బ్’ వెల్లడించింది.
- 1953 నాటి పట్టాభిషేక కార్యక్రమంతో పోలిస్తే ఊరేగింపు మార్గం తక్కువగా ఉంటుందట. అయినప్పటికీ అది పూర్తికావడానికి 40నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
- అప్పట్లో రాణి ఎలిజబెత్ పట్టాభిషేక కార్యక్రమాన్ని సుమారు 3 లక్షల మంది నేరుగా తిలకించారట.
- ఈ కార్యక్రమాన్ని బ్రిటన్లో 3.7కోట్ల మంది తిలకిస్తారని అంచనా. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల సమయంలో వీక్షించిన దానిని బట్టి ఈ మేరకు అంచనా వేశారు.
- పట్టాభిషేక కార్యక్రమాన్ని సాధారణంగా వారాంతంలో జరపరు. ఈ సంప్రదాయాన్ని కింగ్ ఛార్లెస్ పక్కకు పెట్టారు. అయితే, ఫుట్బాల్ కప్ ఫైనల్ మ్యాచ్కు ఇబ్బంది లేకుండా మే 6ను ఎంపిక చేశారట.
- లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో జరిగే ఈ కార్యక్రమం కోసం 700ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన ఓ కుర్చీని సిద్ధం చేస్తున్నారు.
- రాజు ఛార్లెస్-3 భార్య కెమిల్లా మాజీ భర్త ఆండ్రూ పార్కర్ బొవెల్స్ ఈ కార్యక్రమానికి హాజరుకానుండటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్