Kremlin: రష్యా రేడియోలు హ్యాక్.. పుతిన్ పేరిట నకిలీ సందేశం ప్రసారం!
రష్యా రేడియో కేంద్రాలు హ్యాకింగ్ బారిన పడ్డాయి. ఈ క్రమంలో దేశాధ్యక్షుడు పుతిన్ పేరిట ఓ నకిలీ సందేశం ప్రసారమైంది. క్రెమ్లిన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
మాస్కో: ఏడాదిన్నరకు పైగా సాగుతోన్న సైనిక చర్య క్రమంలో భారీ దాడులకు గురైన ఉక్రెయిన్ (Ukraine).. పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో రష్యా (Russia)పై ఎదురుదాడులకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. కొంత కాలంగా డ్రోన్ దాడులతోపాటు రష్యాలోని బెల్గొరాడ్ (Belgorod) ప్రాంతంలో చొరబాటు యత్నాలు మాస్కోను కలవరపరుస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ తాజాగా రష్యా రేడియో స్టేషన్లు హ్యాకింగ్ (Hacking) బారిన పడ్డాయి. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పుతిన్(Putin) పేరిట నకిలీ సందేశం ప్రసారమైంది. ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యా ప్రాంతాల్లో కీవ్ బలగాలు ఆక్రమణకు దిగాయని, ఈ క్రమంలోనే అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సందేశంలో ఉంది. క్రెమ్లిన్ (Kremlin) సోమవారం ఇదే విషయాన్ని వెల్లడిస్తూ.. రేడియో కేంద్రాలను ఎవరో హ్యాక్ చేసినట్లు తెలిపింది.
‘నాటో దేశాల ఆయుధ సాయం, అమెరికా దన్నుతో ఉక్రెయిన్ బలగాలు.. రష్యాలోని కుర్స్క్, బెల్గొరాడ్, బ్రయాన్స్క్ భూభాగాలను ఆక్రమించాయి. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో మార్షల్ లా విధించడంతోపాటు సైనిక సమీకరణ, పౌరుల తరలింపు చర్యలు చేపడుతున్నాం’ అని పుతిన్ మాదిరి స్వరంతో సందేశం ప్రసారమైంది. అయితే, ఇదంతా హ్యాకింగ్ వల్లే జరిగిందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. రేడియో వ్యవస్థను ఇప్పటికే పునరుద్ధరించామన్నారు. బెల్గొరాడ్ పాలనా యంత్రాంగం సైతం ఈ సందేశాన్ని ‘డీప్ ఫేక్’గా కొట్టిపారేసింది. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలా చేసినట్లు ఆరోపించింది. పొరుగున ఉన్న వోరోనెజ్ ప్రాంత అధికారులు కూడా.. భయపడాల్సిన అవసరం లేదని తమ పౌరులకు సూచించారు. ఇదొక రెచ్చగొట్టే చర్య అని మిర్ రేడియో స్టేషన్ మండిపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.