Ukraine Crisis: రోజుకు దాదాపు 200 మంది ఉక్రెయిన్ సైనికుల మరణం..!
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో నిత్యం దాదాపు 200 మంది సైనికులు మృత్యువాత పడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధి మిఖాయిల్ పొడొల్యాక్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: రష్యాతో జరుగుతోన్న యుద్ధంలో నిత్యం దాదాపు 100 నుంచి 200 మంది సైనికులు మృత్యువాత పడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధి మిఖాయిల్ పొడొల్యాక్ పేర్కొన్నారు. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి వందల సంఖ్యలో శతఘ్నుల అవసరం ఉందని ఆయన వెల్లడించారు. మాస్కోతో శాంతి చర్చలు జరిపేందుకు కీవ్ ఏమాత్రం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. డాన్బాస్ స్వాధీనం కోసం రష్యా దళాలు జరుపుతోన్న కర్కశమైన దాడుల్లో ఉక్రెయిన్ దళాలు చిక్కుకొన్నాయని వివరించారు. ‘‘రష్యా దళాలు అణ్వాయుధాలు మినహా ప్రతి ఒక్కదాన్ని యుద్ధ భూమికి తీసుకొస్తున్నాయి. వీటిల్లో భారీ శతఘ్నులు, మల్టిపుల్ రాకెట్ లాంఛర్లు, విమానాలు వంటివి ఉన్నాయి’’ అని మిఖాయిల్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్కు ఆయుధ అవసరాలు తీవ్రంగా ఉన్నాయని మిఖాయిల్ గుర్తుచేశారు. రష్యా ఆయుధ బలం ముందు ఉక్రెయిన్ ఆయుధ బలం సరిపోకపోవడంతో తమ వైపు మరణాలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఉక్రెయిన్కు 150 నుంచి 300 రాకెట్ లాంఛర్లు వ్యవస్థలు అవసరమని ఆయన వివరించారు. రష్యా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి స్వాధీనం చేసుకొన్న భూమిని తిరిగి అప్పగిస్తేనే చర్చలు పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.